అతి వేగం వల్ల ప్రతి రోజు ఎంతోమంది అమాయకుల ప్రాణాలు గాల్లో కలుస్తున్నాయి. తాజాగా హన్మకొండ (Hanmakonda ) లో ఎక్సైజ్ సీఐ కుమారుడు అతి వేగంతో కారు నడిపి ఓ మహిళ ప్రాణాలు తీసాడు. ఫాతిమానగర్ ప్రాంతంలోని పోలింగ్ కేంద్రం దగ్గర కవిత అనే మహిళ ఓటు వేసి తిరిగి ఇంటికి వెళ్తుండగా..ఎక్సైజ్ సీఐ కుమారుడు శరత్ అతి వేగంతో కారు నడుపుతూ ఆమెను ఢీ కొట్టాడు.
దీంతో ఆమె అక్కడిక్కడే మరణించింది. ఈ ఘటనను పోలీసులు పట్టించుకోకపోవడంతో మృతురాలి బంధువులు కాజీపేట పోలీస్ స్టేషన్ ను ముట్టడించారు.
హనుమకొండలో ఒక ఎక్సైజ్ సీఐ కొడుకు రాష్ డ్రైవింగ్తో మహిళ మృతి pic.twitter.com/mkGbqFFM5K
— Telugu Scribe (@TeluguScribe) December 1, 2023