KTR: కరెన్సీ నోట్లపై కూడా ప్రధాని మోడి బొమ్మ వేస్తారేమో..!!

కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌కు అవకాశం కల్పిస్తే.. ఆర్బీఐ ముద్రించే కరెన్సీ నోట్లపై కూడా మోడి బొమ్మను వేస్తారేమోనని..! కేంద్రం తీరుపై మంత్రి కెటిఆర్‌ విమర్శనాస్త్రాలు సంధించారు.

  • Written By:
  • Publish Date - September 16, 2022 / 09:16 PM IST

కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌కు అవకాశం కల్పిస్తే.. ఆర్బీఐ ముద్రించే కరెన్సీ నోట్లపై కూడా మోడి బొమ్మను వేస్తారేమోనని..! కేంద్రం తీరుపై మంత్రి కెటిఆర్‌ విమర్శనాస్త్రాలు సంధించారు. రాబోయే రోజుల్లో కరెన్సీ నోట్లపై ప్రధాని మోడి ఫొటోలు ముద్రించే అవకాశాలు లేకపోలేదని కెటిఆర్‌ ఎద్దేవా చేశారు. మంత్రి నిర్మలా సీతారామన్‌కు ఆ అవకాశం కల్పిస్తే.. ఆర్బీఐ ముద్రించే కరెన్సీ నోట్లపై కూడా మోడి బొమ్మను వేసే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయని, భవిష్యత్‌ లో ఇలా జరిగినా ఆశ్చర్యపోవాల్సన పని లేదని అన్నారు.

గుజరాత్‌లోని అహ్మదాబాద్‌ ఎల్‌జీ వైద్య కళాశాల పేరును ‘నరేంద్ర మోడి మెడికల్‌ కాలేజ్‌’గా మార్చారని మునిసిపల్‌ కార్పొరేషన్‌ స్టాండింగ్‌ కమిటీ ప్రకటన చేసింది. ఈ నేపథ్యంలో… ప్రధాని తీరుపై మంత్రి కెటిఆర్‌ ధ్వజమెత్తారు. గుజరాత్‌ అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా … ఆ రాష్ట్రంలో జరుగుతున్న పరిణామాలపై ఆందోళన వ్యక్తం చేశారు. అహ్మదాబాద్‌లో ఎల్‌జి మెడికల్‌ కాలేజీ పేరును నరేంద్ర మోడి మెడికల్‌ కాలేజీగా మార్చడంపై అభ్యంతరాన్ని వ్యక్తం చేశారు. సర్దార్‌ పటేల్‌ స్టేడియాన్ని నరేంద్ర మోడీ స్టేడియంగా మార్చిన విషయాన్ని గుర్తు చేశారు.