Whats Today : ఇవాళ కాంగ్రెస్ కేంద్ర ఎన్నికల కమిటీ సమావేశం జరగబోతోంది. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి అభ్యర్థుల రెండో జాబితాపై ఈ మీటింగ్ లో కసరత్తు జరగనుంది.
- ఇవాళ తెలంగాణ బీజేపీ అభ్యర్థుల తొలి జాబితాను రిలీజ్ చేసే అవకాశం ఉంది. తొలి జాబితాలో 70 మంది అభ్యర్థులను ప్రకటించే ఛాన్స్ ఉంది.
- ఐసీసీ క్రికెట్ ప్రపంచకప్లో ఇవాళ రెండు మ్యాచ్లు జరుగుతాయి. ఉదయం 10.30 గంటలకు చెన్నైలో నెదర్లాండ్స్తో శ్రీలంక మ్యాచ్ ఉంది. మధ్యాహ్నం 2 గంటలకు ముంబై వేదికగా ఇంగ్లాండ్తో సౌతాఫ్రికా పోరు జరుగుతుంది.
We’re now on WhatsApp. Click to Join.
- ఇవాళ ఏపీ హైకోర్టు అడిషనల్ న్యాయమూర్తుల ప్రమాణస్వీకారం జరుగుతుంది. ఉదయం 11 గంటలకు తుమ్మలపల్లి కళాక్షేత్రంలో నలుగురు అడిషనల్ జడ్జిలు హరినాథ్ నూనెపల్లి, కనపర్తి కిరణ్మయి, జగడం సుమతి, న్యాపతి విజయ్తో గవర్నర్ అబ్దుల్ నజీర్ ప్రమాణస్వీకారం చేయించనున్నారు.
- ఇవాళ ఇస్రో ‘గగన్ యాన్’ కీలక ప్రయోగం జరగబోతోంది.
- ఇవాళ కోరుట్లలో ఎమ్మెల్సీ కవిత పర్యటించనున్నారు.