Site icon HashtagU Telugu

CM Revanth : మంత్రి పదవుల అంశంలో నోరుపారేసుకుంటే.. ఊరుకోం : సీఎం రేవంత్‌

Cm Revanth Reddy Congress Mlas Cabinet Expansion Telangana

CM Revanth : మంత్రి పదవుల కేటాయింపు అంశంపై పలువురు కాంగ్రెస్ ఎమ్మెల్యేలు ఇటీవలే చేసిన వ్యాఖ్యలపై సీఎం రేవంత్ సీరియస్ అయ్యారు. రాష్ట్రంలో మంత్రివర్గ విస్తరణపై కాంగ్రెస్ అధిష్ఠానానిదే తుది నిర్ణయం అని ఆయన తేల్చి చెప్పారు. దీనిపై ఎవరేం మాట్లాడినా ఉపయోగం ఉండదన్నారు. మంత్రి పదవుల అంశంలో పార్టీ గీత దాటాలే మాట్లాడితే ఊరుకునేది లేదని రేవంత్(CM Revanth)  వార్నింగ్  ఇచ్చారు. ఇవాళ కాంగ్రెస్‌ శాసనసభా పక్షం(సీఎల్పీ) సమావేశం వేదికగా  సీఎం రేవంత్‌ ఈ వ్యాఖ్యలు చేశారు.  కాంగ్రెస్ పార్టీకి ఇబ్బంది కలిగించాలని చూస్తే  నేతలే ఇబ్బందులు ఎదుర్కొంటారని ఆయన తేల్చి చెప్పారు. పార్టీకి వ్యతిరేకంగా మాట్లాడితే లాభం కంటే నష్టమే ఎక్కువ జరుగుతుందన్నారు. ఇక ఈరోజు సీఎల్పీ సమావేశంలో ప్రధానంగా నాలుగు అంశాలపై చర్చ జరిగినట్లు సమాచారం.

Also Read :YS Viveka Murder Case: వైఎస్ వివేకా హత్య కేసు.. సునీత వినతికి ‘సుప్రీం’ అంగీకారం

మంత్రి పదవుల కోసం రేసు 

Also Read :Minister Ponguleti : ‘‘ప్రజా ప్రభుత్వాన్ని కూలుస్తారా ? తండ్రీకొడుకులది అధికార దాహం’’