KTR: మాకు యాపిల్ బెదిరింపు నోటిఫికేషన్లు వచ్చాయి: మంత్రి కేటీఆర్

ఎన్నికల ముంగిట రాజకీయ నేతలకు ఆపిల్ ఫోన్స్ నుంచి హ్యాకింగ్ ముప్పు ఉన్నట్టు ఆందోళన వ్యక్తం చేస్తున్న విషయం తెలిసిందే.

  • Written By:
  • Updated On - November 1, 2023 / 12:38 PM IST

KTR: ఎన్నికల ముంగిట రాజకీయ నేతలకు ఆపిల్ ఫోన్స్ నుంచి హ్యాకింగ్ ముప్పు ఉన్నట్టు ఆందోళన వ్యక్తం చేస్తున్న విషయం తెలిసిందే. కనీసం మూడు రాజకీయ పార్టీల నాయకులు తమ ఫోన్‌లు కూడా హ్యాక్‌కు గురయ్యాయని పేర్కొంటూ సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్‌లలో తమకు అందిన యాపిల్ బెదిరింపు నోటిఫికేషన్‌ల స్క్రీన్‌షాట్‌లను పంచుకున్నారు. ఈ విషయం దేశవ్యాప్తంగా హాట్ టాపిక్ గా మారిన నేపథ్యంలో కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ కేంద్ర ప్రభుత్వానికి హెచ్చరికలు జారీ చేశారు.

తాజాగా మంత్రి కేటీఆర్ సైతం ఈ వ్యవహరంపై మండపడ్డారు. ఆపిల్ బెదిరింపు నోటిఫికేషన్ స్క్రీన్‌షాట్‌లను పంచుకున్న ప్రముఖ నాయకులలో BRS వర్కింగ్ ప్రెసిడెంట్ KT రామారావు, TPCC చీఫ్ A రేవంత్ రెడ్డి మరియు AIMIM అధ్యక్షుడు అసదుద్దీన్ ఒవైసీ ఉన్నారు. “రాష్ట్ర ప్రాయోజిత దాడి చేసేవారు నా ఫోన్‌ను లక్ష్యంగా చేసుకుంటున్నారని Apple నుండి సందేశం వచ్చింది. ప్రతిపక్ష నేతలపై దాడి చేయడానికి బిజెపి ఎంతటి స్థాయికైనా దిగజారుతుందని మాకు తెలుసు కాబట్టి ఇది ఆశ్చర్యం కలిగించదు’’ అని కేటీఆర్ మండిపడ్డారు.

ఇక తన ఫోన్‌ను హ్యాక్ చేసి ట్యాప్ చేసేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయని రేవంత్ రెడ్డి కూడా ఆరోపణలు చేసిన విషయం తెలిసిందే. అయితే కొద్దిరోజుల్లో తెలంగాణలో ఎన్నికలు ఉండటంతో అటు అధికార పార్టీ నాయకులు, ఇటు ప్రతిపక్ష పార్టీల నాయకులు హ్యాకింగ్ ముప్పుపై ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

Also Read: Deepotsavams: నవంబర్ 20న టీటీడీ కార్తీక దిపోత్సవాలు: ఈవో ధర్మారెడ్డి