Site icon HashtagU Telugu

Viral video : వరద ప్రాంతాల్లో పర్యటన..ఆప్యాయంగా పలకరించుకున్న కేటీఆర్, బండి సంజయ్

Visit to flood-hit areas..KTR and Bandi Sanjay greeted warmly

Visit to flood-hit areas..KTR and Bandi Sanjay greeted warmly

Viral video : తెలంగాణ రాష్ట్రం వర్షాల తాకిడితో అతలాకుతలమవుతోంది. గత కొన్ని రోజులుగా రాష్ట్రం అంతటా మేఘాలు కమ్ముకొని వానలు మోస్తరుగా కాకుండా, భారీగా కురుస్తున్నాయి. ముఖ్యంగా ఉత్తర, మధ్య తెలంగాణ జిల్లాల్లో వరదల బీభత్సం తీవ్రంగా కనిపిస్తోంది. నీటి ప్రవాహం పెరిగిపోవడంతో నదులు, వాగులు ఉధృతంగా ప్రవహిస్తున్నాయి. ఫలితంగా వందలాది గ్రామాలు జలదిగ్బంధంలో చిక్కుకుని, ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. మండల స్థాయి రహదారులు, లోతట్టు ప్రాంతాలు నీటమునిగి, రవాణా వ్యవస్థ స్తంభించిపోయింది. గ్రామాల్లోని ప్రజలు తమ నివాసాలు విడిచి ప్రభుత్వ ఆధ్వర్యంలోని పాఠశాలలు, కమ్యూనిటీ హాళ్లు వంటి సురక్షిత ప్రదేశాలకు తరలివెళుతున్నారు. రాష్ట్ర ప్రభుత్వం, జిల్లా యంత్రాంగాలు సహాయక చర్యలు ముమ్మరం చేశాయి.

Read Also: IB Jobs : డిప్లొమా, డిగ్రీ అర్హతతో IBలో ఉద్యోగాలు.. నోటిఫికేషన్ విడుదల

ఎన్‌డిఆర్‌ఎఫ్ బృందాలు, అగ్నిమాపక సిబ్బంది, స్థానిక పోలీసులు వరద బాధితులను రక్షించేందుకు క్షేత్రస్థాయిలో పనిచేస్తున్నారు. ఈ పరిస్థితుల్లో, వరద ప్రభావిత ప్రాంతాల్లో కేంద్ర మంత్రి బండి సంజయ్ కుమార్, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కల్వకుంట్ల తారక రామారావు (కేటీఆర్) ఇద్దరూ విడివిడిగా పర్యటించగా, సిరిసిల్ల జిల్లాలోని గంభీరావుపేట మండలంలో అనుకోకుండా ఒకరికి ఒకరు ఎదురయ్యారు. రాజకీయంగా విభిన్న అభిప్రాయాలున్నా, ఆపద సమయంలో పరస్పర ఆత్మీయతను ప్రదర్శించిన ఈ ఇద్దరు నేతలు, ఎంతో సౌహార్దంగా పలకరించుకున్నారు. కేటీఆర్, బండి సంజయ్‌కి వరద పరిస్థితుల గురించి వివరంగా తెలియజేశారు. ఆయా గ్రామాల్లోని బాధితుల పరిస్థితి, సహాయక చర్యలు ఎలా కొనసాగుతున్నాయన్న అంశాలపై చర్చించారు.

ఈ భేటీ సమయంలో తీసిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో విస్తృతంగా పంచుకుంటున్నారు. విభిన్న పార్టీకి చెందిన నేతల మధ్య ఇలాంటి మానవీయత జనాల్లో మంచి ముద్ర వేశాయి. ఈ వీడియోలో బండి సంజయ్, కేటీఆర్‌ మధ్య జరిగిన హృదయపూర్వక సంభాషణ ప్రజల్ని ఆకట్టుకుంటోంది. రాజకీయ విభేదాలు పక్కన పెట్టి, ప్రజల సంక్షేమం కోసం కలిసి పనిచేయాలన్న సందేశాన్ని ఈ సంఘటన ఇచ్చింది. సమకాలీన రాజకీయాల్లో అరుదైనంగా కనిపించే ఈ దృశ్యం, నెటిజన్ల నుంచి ప్రశంసలు పొందుతోంది. ఇక,పై కూడా ప్రజల కష్టసుఖాలలో నేతలు కలిసి నిలబడాలని చాలామంది అభిప్రాయపడుతున్నారు. వరదల నేపథ్యంలో ఏర్పడిన ఈ మానవతా దృశ్యం తెలంగాణ రాజకీయాల్లో ఒక విశేషంగా నిలిచిపోతుందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.

Read Also: KTR : భారీ వర్షాలతో అతలాకుతలమైన సిరిసిల్ల, కామారెడ్డి జిల్లాల్లో కేటీఆర్ పర్యటన