FIR On Kavitha- Revanth Reddy: పోలింగ్ బూత్ బయట ప్రచారం చేయడంతో ఎమ్మెల్సీ కవిత (FIR On Kavitha- Revanth Reddy)పై ఫిర్యాదు అందినట్లు సీఈవో వికాస్ రాజ్ తెలిపారు. దీనిపై డీఈవోకు నివేదించామని.. ఎఫ్ఐఆర్ కూడా నమోదైనట్లు చెప్పారు. మరిన్ని చోట్ల ఫిర్యాదులు అందాయని తెలిపారు. రాష్ట్రంలో పోలింగ్ ప్రశాంతంగా కొనసాగుతోందని.. రెండు, మూడు చోట్ల ఈవీఎంలు మార్చామని చెప్పారు. ఓటర్ కార్డు లేకపోతే 12 ప్రత్యామ్నాయ కార్డులకు గుర్తింపు ఉందన్నారు. ఇప్పటికే కాంగ్రెస్ నాయకులు ఈసికి ఫిర్యాదు చేయగా ఎఫ్ఐఆర్ నమోదయినట్లు ఎన్నికల అధికారి వికాస్ రాజ్ తెలిపారు. రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలపై కూడా ఫిర్యాదు వస్తే ఎఫ్ఐఆర్ నమోదయిందన్నారు. మరికొన్ని ఫిర్యాదులు కూడా వచ్చాయని, ఆయా డీఈవోలకు పంపించామని, చర్యలు తీసుకుంటామని వెల్లడించారు.
Also Read: Lowest Polling: ఎప్పటిలాగే హైదరాబాద్ లో అతి తక్కువ పోలింగ్..!
రేవంత్ రెడ్డిపై కూడా ఫిర్యాదు
టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డిపై బీఆర్ఎస్ నేతలు ఎన్నికల కమిషన్ కు ఫిర్యాదు చేశారు. కోడంగల్ లో ఓటు వేసిన అనంతరం ఓటర్లను ప్రలోభపెట్టే వ్యాఖ్యలు చేశారని, ఆయనపై చర్యలు తీసుకోవాలని కోరారు.
We’re now on WhatsApp. Click to Join.