Underground Stations: హైదరాబాద్‌లో అండర్ గ్రౌండ్‌ మెట్రో.. మెట్రో రైల్ ఎండీ వెల్లడి.!

హైదరాబాద్ నగరంలో అండర్ గ్రౌండ్‌ మెట్రో అందుబాటులోకి తీసుకురానున్నట్లు మెట్రో రైల్ ఎండీ ఎన్వీఎస్ రెడ్డి వెల్లడించారు.

  • Written By:
  • Publish Date - November 29, 2022 / 08:35 PM IST

హైదరాబాద్ నగరంలో అండర్ గ్రౌండ్‌ మెట్రో అందుబాటులోకి తీసుకురానున్నట్లు మెట్రో రైల్ ఎండీ ఎన్వీఎస్ రెడ్డి వెల్లడించారు. రెండో దశలో రాయదుర్గం-శంషాబాద్ విమానాశ్రయం వరకు 31కి.మీ. మెట్రో కారిడార్‌ నిర్మాణాన్ని చేపట్టనున్నారు. దీనిలో భాగంగా విమానాశ్రయం సమీపంలో 2.5 కి.మీ. అండర్‌ గ్రౌండ్ మెట్రో నిర్మించనున్నట్లు చెప్పారు. ఫేజ్-2 పనులకు డిసెంబర్ 9న సీఎం కేసీఆర్ శంకుస్థాపన చేస్తారని ఎన్వీఎస్‌ రెడ్డి తెలిపారు.

హైదరాబాద్ మెట్రో రైల్ లిమిటెడ్ (హెచ్‌ఎంఆర్‌ఎల్) మంగళవారం శంషాబాద్‌లోని మెట్రో స్టేషన్‌ను నేరుగా రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయానికి ఫేజ్ II కింద అనుసంధానం చేయనున్నట్లు తెలిపింది. హెచ్‌ఎంఆర్‌ఎల్ ఎండి ఎన్‌విఎస్ రెడ్డి కూడా ఈ దశలో భూగర్భ స్టేషన్‌లు ఉంటాయని చెప్పారు. శంషాబాద్‌లోని మెట్రో స్టేషన్‌ను నేరుగా రాజీవ్‌గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయానికి అనుసంధానం చేస్తామని, ప్రస్తుతం ప్రయాణికులకు మరిన్ని సౌకర్యాలు కల్పించేందుకు కృషి చేస్తున్నామని ఆయన చెప్పారు.

అమీర్‌పేట మెట్రో స్టేషన్‌లో జరిగిన ఎల్‌అండ్‌టి మెట్రో రైల్ (హైదరాబాద్) లిమిటెడ్ (ఎల్‌అండ్‌టిఎమ్‌ఆర్‌హెచ్‌ఎల్) హెచ్‌ఎంఆర్‌ఎల్ 5వ వార్షికోత్సవంలో ఎన్వీఎస్ రెడ్డి మాట్లాడారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఓఆర్‌ఆర్ వద్ద ఇప్పటికే మెట్రో కారిడార్ ఉందని, వచ్చే మూడేళ్లలో రెండో దశ పనులు సజావుగా పూర్తి చేస్తామన్నారు. తెలంగాణ ముఖ్యమంత్రి కెసిఆర్ డిసెంబర్ 9, 2022న ఎయిర్‌పోర్ట్ ఎక్స్‌ప్రెస్ మెట్రోకు శంకుస్థాపన చేయనున్నారు. తెలంగాణ మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్, పట్టణాభివృద్ధి శాఖ మంత్రి కేటీఆర్ నవంబర్ 27న ఈ వార్తను ట్విట్టర్‌లో ప్రకటించారు. మైండ్‌స్పేస్ జంక్షన్ నుండి శంషాబాద్ ఎయిర్‌పోర్ట్ వరకు 31 కి.మీ పొడవుతో ఈ ప్రాజెక్ట్ దాదాపు రూ. 6,250 కోట్లు ఖర్చు అవుతుందని ఆయన ట్వీట్ చేశారు.

మేము DPR సమర్పించాము. అదనపు 31 KM నగర మెట్రో విస్తరణ కోసం భారత ప్రభుత్వంతో చర్చలు జరుపుతున్నాము. BHEL నుండి లక్డికాపూల్ 26 KM, నాగోల్ నుండి LB నగర్ 5 KM” అని ఆయన చెప్పారు. ఫేజ్ II మెట్రో లైన్ రాయదుర్గ్ నుండి కొనసాగుతుంది. ఖాజాగూడ, నానక్ రామ్‌గూడ, మంచిరేవుల,శంషాబాద్ మీదుగా వెళుతుంది. చివరకు రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయంతో కలుపుతుందని పేర్కొన్నారు.