రాజాసింగ్ వ‌ర్సెస్ కేటీఆర్‌.. కాక‌రేపుతున్న ట్విట్ట‌ర్ వార్‌

హైద‌రాబాద్ - బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్‌, మంత్రి కేటీఆర్ ల మ‌ధ్య ట్విట్ట‌ర్ వార్ జ‌రుగుతోంది. ఒక‌రిపై ఒక‌రు వ‌రుస ట్వీట్‌ల‌తో రెచ్చిపోతున్నారు. చ‌ద‌వండి

  • Written By:
  • Publish Date - October 23, 2021 / 12:17 PM IST

హైద‌రాబాద్ – బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్‌, మంత్రి కేటీఆర్ ల మ‌ధ్య ట్విట్ట‌ర్ వార్ జ‌రుగుతోంది. హుజురాబాద్ ఎన్నిక‌ల నేప‌ధ్యంలో ఇద్ద‌రూ ఒక‌రిపై ఒకరు ట్వీట్ల బుర‌ద జల్లుకుంటున్నారు. పొలిటిక‌ల్ స్టంట్స్ మానేసి ప‌నిచేసి ప్ర‌జ‌ల మ‌న‌సు దోచుకోవాలంటూ రాజాసింగ్‌కు కేసీఆర్ స‌ల‌హా ఇచ్చారు

కేటీఆర్ ట్విట్‌కి కౌంట‌ర్‌గా రాజాసింగ్ మ‌రో ట్వీట్ చేశారు. త‌న బుల్లెట్‌పై ఒకసారి ఓల్డ్‌సిటీ గోషామ‌హ‌ల్ వ‌స్తే అభివృద్ధి ఏమాత్రం జ‌రిగిందో తెలుస్తుందంటూ కౌంట‌ర్ ఇచ్చారు.

అయితే, ఇంత‌టితో ఈ ట్వీట్ వార్ ఆగిపోలేదు. రాజాసింగ్ ట్వీట్‌కి కేటీఆర్ త‌న‌దైన స్టైల్‌లో కౌంట‌ర్ ట్వీట్ చేశారు. ఒక‌సారి పెట్రోల్ బంక్‌ల‌కు వెళ్లి పెరిగిన థ‌ర‌ల‌పై ప్ర‌జ‌ల అభిప్రాయం తెలుసుకోవ‌చ్చు క‌దా.. అలాగే ప‌నిలోప‌నిగా ఇళ్ల‌లోకి వెళ్లి గ్యాస్ ధ‌ర‌లపెంపుపై గృహిణులు ఏమ‌నుకుంటున్నారో తెలుసుకోండి.. ప‌నిచేసి ప్ర‌జ‌ల మ‌న‌సులు గెల‌వాలి కానీ.. రాజ‌కీయాల‌తో కాదు అంటూ ట్వీట్ చేశారు.