తెలంగాణ రాష్ట్రంలో టీఎస్పీఎస్సీ (TSPSC) పేపర్ లీక్ ఘటన నేటికి చర్చనీయాంశవుతూనే ఉంది. ఇప్పటికే పేపర్ లీక్ ఇష్యూ అనేక మలుపులు తిరుగుతోంది. తాజాగా షాకింగ్ విషయం ఒకటి బయటకొచ్చింది. ఓ ప్రేమికుడు తన ప్రియురాలి కోసం డీఏవో పరీక్ష పేపర్ను రూ.6 లక్షలకు కొనుగోలు చేసినట్లు సమాచారం. వీరిద్దరినీ మేజిస్ట్రేట్ ముందు హాజరుపరిచి జ్యుడీషియల్ రిమాండ్కు తరలించారు.
TSPSC పేపర్ల వెల్లడి రాష్ట్రంలో సంచలనంగా మారడంతో పాటు రాజకీయంగా పెను దుమారం రేపింది. విపక్షాలు, విద్యార్థి సంఘాల నిరసనల నేపథ్యంలో ప్రభుత్వం సిట్ను ఏర్పాటు చేసి విచారణ చేపట్టింది. ప్రేమికుడు లౌకిక్ తన ప్రియురాలు అయిన సుస్మిత కోసం డివిజనల్ అకౌంట్స్ ఆఫీసర్ (డీఏవో)కి ప్రవీణ్ కు రూ.6 లక్షలు చెల్లించి ఫిబ్రవరి 26న జరిగే పరీక్ష పేపర్ను కొనుగోలు చేశాడు. పేపర్ల లీక్ తర్వాత, తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఇతర పరీక్షలతో పాటు DAO పరీక్షను రద్దు చేసింది. కేసును విచారిస్తున్న సిట్ వందలాది మందికి నోటీసులు జారీ చేసి విచారించగా ఇప్పటివరకు 17 మందిని అరెస్టు చేసింది. ఇందులో ఈ ప్రేమ జంట కూడా ఉంది. లౌకిక్ ప్రవీణ్ నుండి DAOs ప్రవేశ పరీక్షకు సంబంధించిన ప్రశ్నాపత్రాన్ని రూ. 6 లక్షలు చెల్లించి కొనుగోలు చేశాడని స్పష్టమైంది.
అయితే కుంభకోణంలో ప్రధాన నిందితుల్లో ఒకరైన ప్రవీణ్తో లౌకిక్ ఎలా టచ్లో ఉన్నాడు అనేది స్పష్టంగా తెలియలేదు. కానీ లౌకిక్ తన ప్రేయసి సుస్మితకు ప్రవేశ పరీక్షలో సహాయపడటానికి లీక్ అయిన TSPSC పేపర్ను ఇచ్చాడు. ప్రవీణ్ బ్యాంక్ స్టేట్మెంట్లను తనిఖీ చేయగా, సిట్ లౌకిక్ బ్యాంక్ ఖాతా నుంచి డబ్బు ట్రాన్సఫర్ చేసినట్టు తేలింది. కమిషన్ కార్యదర్శిని సిట్ తన కార్యాలయానికి పిలిపించి, ప్రజాస్వామ్యబద్ధంగా విచారణ చేపట్టిన చైర్మన్ జనార్దన్రెడ్డికి నోటీసులివ్వడానికి బదులు, ఆయన వాంగ్మూలాన్ని ఆయన కార్యాలయంలో నమోదు చేశారు. గ్రూప్-1 ప్రిలిమినరీ పరీక్షలో మొత్తం 150 మార్కులకు 100 మరియు అంతకంటే ఎక్కువ మార్కులు సాధించిన అభ్యర్థులందరినీ కూడా సిట్ ప్రశ్నిస్తోంది.
Also Read: Rashmika Wishesh: హ్యాపీ బర్త్ డే మై డియర్ పుష్పరాజ్.. బన్నీకి రష్మిక స్పెషల్ విషెస్!