TSPSC Leakage: పోస్టర్లు కలకలం.. టీఎస్పీఎస్సీ ఓ జిరాక్స్ సెంటర్ అంటూ పోస్టర్లు..!

టీఎస్పీఎస్సీ (TSPSC) కార్యాలయం వద్ద వాల్ పోస్టర్లు కలకలం సృష్టిస్తున్నాయి. టీఎస్పీఎస్సీ కార్యాలయం జిరాక్స్ సెంటర్ అంటూ పోస్టర్లు వెలిశాయి. ఓయూ జేఏసీ చైర్మన్ అర్జున్ బాబు పేరిట ఈ పోస్టర్లు ప్రచురితమయ్యాయి.

  • Written By:
  • Updated On - March 22, 2023 / 07:00 PM IST

టీఎస్పీఎస్సీ (TSPSC) కార్యాలయం వద్ద వాల్ పోస్టర్లు కలకలం సృష్టిస్తున్నాయి. టీఎస్పీఎస్సీ కార్యాలయం జిరాక్స్ సెంటర్ అంటూ పోస్టర్లు వెలిశాయి. ఓయూ జేఏసీ చైర్మన్ అర్జున్ బాబు పేరిట ఈ పోస్టర్లు ప్రచురితమయ్యాయి. అన్ని రకాల ప్రభుత్వ ఉద్యోగాల ప్రశ్నపత్రాలు ఇక్కడ అందుబాటులో ఉన్నాయని పోస్టర్లు అంటించారు.

ఇదిలా ఉండగా.. టీఎస్పీఎస్సీ పేపర్ లీకేజీపై ఆందోళనలు కొనసాగుతున్నాయి. మరోవైపు పరీక్ష రాసిన అభ్యర్థులు, విద్యార్థి సంఘాలు పెద్ద ఎత్తున ఆందోళనలు చేస్తున్నాయి. గత కొద్ది రోజులుగా టీఎస్పీఎస్సీ వ్యవహారం అభ్యర్థులను విస్మయానికి గురిచేస్తోంది. టీఎస్‌పీఎస్సీని రద్దు చేయాలనే డిమాండ్లు ఉన్నాయి. ఇప్పటికే ఈ కేసుకు సంబంధించి నిందితులను ఐదో తేదీన సిట్ కస్టడీలోకి తీసుకుని విచారించనుంది. నేడు హిమాయత్‌నగర్ సిట్ కార్యాలయంలో విచారణ జరగనుంది. గ్రూప్ 1 రాసిన వారిలో కొందరు టీఎస్‌పీఎస్సీ ఉద్యోగులు ఉన్నట్లు సిట్ గుర్తించింది. కమిషన్ లో వివిధ విభాగాల్లో పనిచేస్తున్న 8 మంది గ్రూప్ 1 రాసినట్లు తేలింది. ఈ 8 మందికి నోటీసులు ఇచ్చిన తర్వాత సిట్ విచారణ జరుపుతుంది. ప్రవీణ్, రాజశేఖర్ ఇళ్లలో పెన్ డ్రైవ్‌లను సిట్ స్వాధీనం చేసుకుంది. కానీ పెన్ డ్రైవ్ లకు కూడా పాస్ వర్డ్ సెట్ చేసినట్లు తెలుస్తోంది. కాన్ఫిడెన్షియల్ సెక్షన్ ఆఫీసర్ శంకరలక్ష్మిని సిట్ అధికారులు విచారించారు.

Also Read: Saudi Airport: సౌదీ ఎయిర్‌పోర్టులో తెలంగాణ వ్యక్తి మృతి.. మరణించిన మూడు వారాల తర్వాత వెలుగులోకి..!

పోస్టర్‌లో ఏముంది..?

– తప్పు చేసిన TSPSC బోర్డుని రద్దు చేయకుండా పరీక్షను ఎందుకు రద్దు చేశారు? తప్పు చేసిందేమో టీఎస్పీఎస్సీ బోర్డు.. శిక్ష మాత్రం విద్యార్థులకా? ఇదీ ప్రస్తుత తెలంగాణ ప్రభుత్వ పనితీరు.

– ముఖ్యమంత్రి గారు మీరు వెంటనే తెలంగాణ విద్యార్థులకు క్షమాపణలు చెప్పాలి

– ప్రశ్నపత్రం లీకేజీలో మీ కుటుంబ సభ్యుల పాత్ర లేదని వెంటనే సీబీఐకి అప్పగించి టీఎస్‌పీఎస్సీ బోర్డును, సంబంధిత మంత్రిని తొలగించాలి.

– నష్టపోయిన విద్యార్థులకు నెలకు రూ.10 వేల చొప్పున ప్రభుత్వం ఈ నెల నుంచి మళ్లీ పరీక్ష నిర్వహించే వరకు నష్టపరిహారం చెల్లించాలి’ అని పోస్టర్లు వెలిశాయి.