Kavitha : బీఆర్ఎస్‌తో బంధం తెగిపోయింది – కవిత

Kavitha : “అధికారం ఎవరికి శాశ్వతం కాదు. అలా అనుకున్న వారిని ప్రజలు ఇంట్లో కూర్చోబెట్టారు,” అంటూ ఆమె వ్యాఖ్యానించారు

Published By: HashtagU Telugu Desk
Kavitha

Election Commission deals a blow to Kavitha's party; 'Telangana Rakshana Sena' name must be changed.

తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు, ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత బీఆర్ఎస్‌పై మరియు మాజీ మంత్రి టి. హరీశ్‌రావుపై చేసిన వ్యాఖ్యలు రాష్ట్ర రాజకీయాల్లో తీవ్ర చర్చకు దారితీశాయి. వరంగల్ ప్రెస్‌క్లబ్‌లో జరిగిన ‘మీట్ ది ప్రెస్’ కార్యక్రమంలో కవిత ఘాటుగా స్పందించారు. “అధికారం ఎవరికి శాశ్వతం కాదు. అలా అనుకున్న వారిని ప్రజలు ఇంట్లో కూర్చోబెట్టారు,” అంటూ ఆమె వ్యాఖ్యానించారు. తనను పార్టీ నుంచి కనీసం షోకాజ్ నోటీసు ఇవ్వకుండానే అవమానకరంగా సస్పెండ్ చేశారని ఆవేదన వ్యక్తం చేశారు. “నేనూ తెలంగాణ బిడ్డనే, ఆకలినైనా తట్టుకుంటా కానీ అవమానాన్ని మాత్రం తట్టుకోను,” అని కవిత స్పష్టంగా చెప్పారు. తెలంగాణ ఉద్యమ సమయంలో ‘బతుకమ్మ’ పేరిట పల్లెల్లో తిరిగిన తనను, ప్రభుత్వం ఏర్పడ్డాక ప్రోటోకాల్ పేరుతో నిజామాబాద్‌కే పరిమితం చేశారని ఆమె పేర్కొన్నారు.

‎Curd: కేవలం ఒక చెంచా పెరుగుతూ ముఖాన్ని, జుట్టుని షైనీగా మార్చుకోండిలా?

కవిత ఈ సందర్భంగా మాజీ మంత్రి హరీశ్‌రావుపై కూడా తీవ్ర ఆరోపణలు చేశారు. వరంగల్ సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రి నిర్మాణ పనులను రూ.1,100 కోట్ల అంచనాతో హరీశ్‌రావుకు చెందిన బినామీ కంపెనీకి అప్పగించారని ఆరోపించారు. ఆ తర్వాత వ్యయాన్ని రూ.1,700 కోట్లకు పెంచుకున్నారని విమర్శించారు. ఈ ప్రాజెక్టుపై ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం విజిలెన్స్ విచారణ జరిపినా, ఎందుకు చర్యలు తీసుకోవడం లేదని ప్రశ్నించారు. “ప్రజల డబ్బుతో అవినీతి చేసిన వారిని రక్షించడం ఎవరి ప్రయోజనానికి?” అంటూ ఆమె నిలదీశారు. ఈ ఆరోపణలు బీఆర్ఎస్‌ లో అంతర్గత విభేదాలను మరింతగా బయటపెట్టడమే కాకుండా, తెలంగాణ రాజకీయ సమీకరణాలను కదిలించే అవకాశముంది.

ఇక కాంగ్రెస్ ప్రభుత్వంపైనా కవిత విమర్శలు గుప్పించారు. రెండు సంవత్సరాలుగా అధికారంలో ఉన్నా, కాంగ్రెస్ తాము వాగ్దానం చేసిన అంశాల్లో ఏదీ నెరవేర్చలేదని ఆమె అన్నారు. “మెగా డీఎస్సీ ప్రకటించండి, గ్రూప్స్ పరీక్షలను పారదర్శకంగా నిర్వహించండి, తుపాన్ బాధితులకు తక్షణ సాయం చేయండి” అని కవిత డిమాండ్ చేశారు. రైతుల సమస్యలు, ధాన్యం కొనుగోలుపై ప్రభుత్వ నిర్లక్ష్యాన్ని ఆమె తీవ్రంగా తప్పుబట్టారు. ప్రస్తుతానికి తాను ప్రజా సమస్యలపైనే దృష్టి పెట్టినప్పటికీ, ఎన్నికలకు ఏడాది ముందు తన రాజకీయాలు స్పష్టంగా ఉంటాయని ప్రకటించారు. “ఆడబిడ్డ కూడా రాజకీయాల్లో ఎంత బలంగా నిలబడగలదో చూపిస్తా” అంటూ కవిత తన భవిష్యత్‌ రాజకీయ యత్నాలకు సంకేతం ఇచ్చారు. మహిళలకు రాజకీయాల్లో మరింత అవకాశాలు రావాలని కోరుతూ, తన పోరాటం ప్రజల కోసం కొనసాగుతుందని ఆమె స్పష్టం చేశారు.

  Last Updated: 10 Nov 2025, 10:28 AM IST