Telangana Crime: లింగమార్పిడి చేయించుకున్న భర్తను హత్య చేయించిన భార్య

లింగమార్పిడి శస్త్ర చికిత్స చేయించుకుని వేధిస్తున్న భర్తను చంపేందుకు ఓ మహిళ రూ.18 లక్షలకు కిరాయి రౌడీలకు సఫారీ ఇచ్చి అంతమొందించింది. ఈ ఘటన తెలంగాణలో చోటు చేసుకుంది.

Telangana Crime: లింగమార్పిడి శస్త్ర చికిత్స చేయించుకుని వేధిస్తున్న భర్తను చంపేందుకు ఓ మహిళ రూ.18 లక్షలకు కిరాయి రౌడీలకు సఫారీ ఇచ్చి అంతమొందించింది. ఈ ఘటన తెలంగాణలో చోటు చేసుకుంది. మహిళతో పాటు ఇద్దరు నిందితులను అరెస్టు చేయడంతో ఈ ఘటన వెలుగు చూసింది. మరో ముగ్గురు నిందితుల కోసం గాలిస్తున్నట్లు పోలీసులు తెలిపారు.

గతంలో దరిపల్లి వెంకటేష్ అని పిలిచే రోజా హత్య జరిగిన మూడు వారాల తర్వాత వేదశ్రీ మరియు ఇతర నిందితులను అరెస్టు చేశారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం డిసెంబర్ 11న రోజాతో కలిసి మద్యం పార్టీ చేసుకున్న తర్వాత హంతకులు రోజాను పొట్టన పెట్టుకున్నారు. రోజాను హత్య చేసేందుకు వేదశ్రీ రూ.18 లక్షల సుపారీ ఇచ్చింది. 4.60 లక్షలు అడ్వాన్స్‌గా చెల్లించి, మిగిలిన మొత్తాన్ని తర్వాత చెల్లిస్తానని హామీ ఇచ్చింది.

సిద్దిపేట పట్టణానికి చెందిన వెంకటేష్‌తో వేదశ్రీకి 2014లో వివాహం జరిగింది. ఈ దంపతులకు ఎనిమిదేళ్ల కుమార్తె ఉంది. వెంకటేష్ మొదట్లో అదనపు కట్నం కోసం భార్యను వేధించేవాడు. తరువాత అతని ప్రవర్తనలో మార్పు వచ్చింది మరియు అతను లింగ మార్పిడి శస్త్రచికిత్స చేయించుకున్నాడు. తన పేరును రోజాగా మార్చుకుని సిద్దిపేట పట్టణంలో రోడ్లపై భిక్షాటన చేయడం ప్రారంభించాడు. తమ కుమార్తెను భిక్షాటన కోసం తనతో పంపాలని వేదశ్రీని రోజా వేధించేది. వేదశ్రీ టీచర్‌గా పనిచేస్తున్న ప్రైవేట్ స్కూల్‌ వద్దకు వచ్చి ఆమెతో వాగ్వాదానికి దిగాడు. పాఠశాలలో రోజా సమస్యలు సృష్టించడంతో ఆమె ఉద్యోగం కోల్పోయింది.

అదే పట్టణానికి చెందిన బోయిని రమేష్ (32)తో స్నేహంగా మెలిగిన వేదశ్రీ.. రోజాను అంతమొందించేందుకు అతడితో కలిసి పథకం వేసింది. పథకం ప్రకారం ఇప్ప శేఖర్ (24) ఒంటరిగా ఉంటున్న రోజా ఇంటికి వెళ్లి మద్యం తాగించాడు. నిందితులు మరో ఇద్దరితో కలిసి కొట్టి చంపారు. వన్ టౌన్ పోలీస్ స్టేషన్‌లో అనుమానాస్పద మృతిగా కేసు నమోదైంది. శవపరీక్ష నివేదికలో రోజా హత్యేనని తేలడంతో పోలీసులు విచారణ ప్రారంభించి శాస్త్రీయ ఆధారాలు సేకరించారు. వేదశ్రీని విచారించగా నేరం ఒప్పుకుంది. మొత్తం ఐదుగురు నిందితులు వేదశ్రీ హత్యకు సహకరించారని పోలీసులు తెలిపారు. ఆమెతోపాటు రమేష్‌, శేఖర్‌లను అరెస్టు చేసి జ్యుడీషియల్‌ కస్టడీకి తరలించారు. మరో ముగ్గురు నిందితుల కోసం పోలీసులు గాలిస్తున్నారు.

Also Read: Durga Temple : ఇంద్ర‌కీలాద్రీపై ముగిసిని భ‌వానీ దీక్ష‌ల విర‌మ‌ణ‌.. అమ్మ‌వారిని ద‌ర్శించుకున్న నాలుగు ల‌క్షల మంది భ‌క్తులు