Site icon HashtagU Telugu

Telangana: ఇథనాల్ ప్లాంట్‌కు వ్యతిరేకంగా నిరసనలు..హింసాత్మకం

Telangana (47)

Telangana (47)

Telangana: తెలంగాణలోని నారాయణపూర్ జిల్లాలోని ఓ గ్రామంలో నిర్మాణంలో ఉన్న ఆగ్రో ఇథనాల్ ప్లాంట్‌కు వ్యతిరేకంగా రైతులు చేపట్టిన నిరసనలో హింస చెలరేగింది.ప్లాంట్‌కు సంబంధించిన యంత్రాల రవాణాను ఆపేందుకు ప్రయత్నించిన నిరసనకారులపై పోలీసులు లాఠీచార్జి చేయడంతో నిరసనకారులు పోలీసు వాహనానికి నిప్పు పెట్టారు.

మరికల్‌ మండలం చిత్తనూరు గ్రామంలో ప్లాంట్‌ కోసం యంత్రాలను తరలిస్తున్న వాహనాలను స్థానికులు అడ్డుకోవడంతో ఉద్రిక్తత నెలకొంది. పోలీసులు రంగప్రవేశం చేసి ఆందోళనకారులను తొలగించారు. దీంతో ఇరువర్గాల మధ్య తోపులాట జరిగింది. దీంతో ఆందోళనకారులను చెదరగొట్టేందుకు పోలీసులు లాఠీచార్జి చేశారు. పోలీసుల చర్యపై ఆగ్రహించిన గ్రామస్థులు పోలీసు వాహనానికి నిప్పుపెట్టి రాళ్లు రువ్వారు. రాళ్ల దాడిలో ఓ పోలీసు అధికారికి గాయాలయ్యాయి. పరిస్థితిని అదుపు చేసేందుకు పోలీసులు అదనపు బలగాలను గ్రామానికి పంపించారు.

ఇథనాల్‌ ప్లాంట్‌తో పొలాల్లోని నీటిని ఫ్యాక్టరీకి మళ్లిస్తారనే భయంతో చిత్తనూరుతో పాటు చుట్టుపక్కల గ్రామాల రైతులు దీనిని వ్యతిరేకిస్తున్నారు. జూరాల ఆర్గానిక్ ఫామ్స్ అండ్ ఆగ్రో ఇండస్ట్రీస్ లిమిటెడ్‌కు చెందిన ఇథనాల్ ప్లాంట్ వల్ల ఈ ప్రాంతంలో కాలుష్యం ఏర్పడుతుందని చిత్తనూర్, ఎక్లాస్‌పూర్, జిన్నారం గ్రామాల వాసులు కూడా భయపడుతున్నారు. అయితే నిరసన ఉన్నప్పటికీ, ఈ సంవత్సరం ప్రారంభంలో ప్లాంట్ నిర్మాణం ప్రారంభమైంది.

Also Read: Mission Chanakya Survey Report : తెలంగాణ ఎన్నికల్లో విజయం సాధించేది ఆ పార్టీయే – మిషన్ చాణక్య పబ్లిక్ పోల్స్ సర్వే