Site icon HashtagU Telugu

Telangana : వ‌ర‌ద‌ల కార‌ణంగా న‌ష్ట‌పోయిన పంట‌ల‌కు ప‌రిహారం ఇవ్వండి .. స‌ర్కార్‌కు తెలంగాణ రైతులు విజ్ఞ‌ప్తి

Floods Imresizer

Floods Imresizer

వరదల కారణంగా నష్టపోయిన రైతులకు ఎకరాకు రూ.25 వేలు పరిహారం చెల్లించాలని రైతులు డిమాండ్ చేశారు. తెలంగాణ వ్యాప్తంగా చాలా జిల్లాల్లో వ‌ర‌ద‌ల కార‌ణంగా వేల ఎక‌రాల్లో పంట న‌ష్టం వాటిల్లింది. దీంతో రైతులు ఆర్థికంగా తీవ్రంగా న‌ష్ట‌పోయారు. ఆదిలాబాద్ జిల్లా బేల మండలంలోని వివిధ గ్రామాల రైతులు శివాజీచౌక్ వద్ద ధర్నాకు దిగారు. పంట నష్టాన్ని అంచనా వేయడానికి రాష్ట్ర ప్రభుత్వం సర్వేకు ఆదేశించాలని రైతులు కోరారు. ఆదిలాబాద్‌ యువజన కాంగ్రెస్‌ ప్రధాన కార్యదర్శి రూపేష్‌రెడ్డి ఆధ్వర్యంలో నిరసన తెలిపారు. నిరసనను అడ్డుకునేందుకు పోలీసులు ప్రయత్నించడంతో పోలీసులపై రైతులు వాగ్వాదానికి దిగారు. పెంగంగ నది బ్యాక్ వాటర్‌తో పాటు తమ పొలాలను వరద నీరు ముంచెత్తడంతో రైతులు పెద్ద ఎత్తున పంట నష్టపోతున్నారని కాంగ్రెస్ నేత రూపేష్ రెడ్డి అన్నారు. ధ‌ర్నా అనంతరం రైతులు, కాంగ్రెస్ నాయకులు తహసీల్దార్‌కు వినతి పత్రం సమర్పించారు. మాజీ జెడ్పీటీసీ రాందాస్ నక్లే, బేల మార్కెట్‌ కమిటీ మాజీ చైర్మన్‌ వామన్‌రావు, కిసాన్‌ సెల్‌ నాయకుడు ఘన్‌ శ్యామ్‌, కాంగ్రెస్‌ సీనియర్‌ నాయకుడు రూపారావు, యువజన కాంగ్రెస్‌ నాయకులు పాల్గొన్నారు.