Congress MLAs: ప్రస్తుత తెలంగాణ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ స్పష్టమైన మెజార్టీ సాధించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీలో కాబోయే సీఎం ఎవరు? ఎవరికి క్యాబినెట్ బెర్తులు దక్కుతాయి? అనే అంశాలు హాట్ టాపిక్ గా మారాయి. ఇప్పటికే సీఎం ఎంపిక కొలిక్కిరాక అయోమయంలో ఉన్న అగ్రనేతలకు క్యాబినెట్ పదవుల కోసం ఒత్తిళ్లు తెస్తున్నారు కాంగ్రెస్ ఎమ్మెల్యేలు.
చెన్నూరు, బెల్లంపల్లి, మంచిర్యాల నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న గడ్డం సోదరులు వివేక్, వినోద్, మంచిర్యాల నుంచి కొక్కిరాల ప్రేంసాగర్రావుతో సహా కాంగ్రెస్ నుంచి ఎన్నికైన శాసనసభ్యులు మంత్రివర్గంలో మంత్రి పదవుల కోసం వివిధ మార్గాల్లో లాబీయింగ్లు ప్రారంభించారు. టీపీసీసీ చీఫ్ ఎ. రేవంత్రెడ్డి సూచన మేరకు బీజేపీలో ఉన్న వివేక్ కాంగ్రెస్లో చేరిన సంగతి తెలిసిందే. ఉమ్మడి నల్లగొండ జిల్లాలో కీలక పాత్ర వహించిన కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి సైతం కీలక పదవి ఆశిస్తున్నారు.
మధిర నుంచి గెలుపొందిన సీఎల్పీ నేత మల్లు భట్టి విక్రమార్క కేబినెట్లో అగ్రస్థానాన్ని ఆశించగా, పీలేరు, ఖమ్మం నుంచి గెలిచిన పొంగులేటి శ్రీనివాస్రెడ్డి, తుమ్మల నాగేశ్వరరావు కూడా రేసులో ఉన్నారు. ఖాన్పూర్కు చెందిన ఓ వ్యక్తి రేవంత్రెడ్డికి అత్యంత సన్నిహితుడు. అంతేకాదు.. వేదమ బొజ్జు ఎస్టీ కమ్యూనిటీ కోటా కింద తమకు అవకాశం కల్పించాలని ఆశిస్తున్నారు. అంతేకాదు.. దేవరకొండ నుంచి గెలిచిన బాలునాయక్, అచ్చంపేట నియోజకవర్గం గెలిచిన ఎమ్మెల్యే వంశీలు సైతం మంత్రి పదవి ఇవ్వాలని పట్టుపడుతున్నారు. ఈ నేపథ్యంలో సీఎం పోస్టు మాత్రమే కాకుండా క్యాబినెట్ బెర్తులు కూడా తెలంగాణలో ఆసక్తి రేపుతున్నాయి.
Also Read: Rahul Gandhi: తుఫాన్ బాధితులకు అండగా నిలబడండి, కాంగ్రెస్ కార్యకర్తలకు రాహుల్ పిలుపు