Site icon HashtagU Telugu

Cabinet Expansion: పార్టీ పదవుల వ్యవహారం.. పలువురు సీనియర్లపై రాహుల్ ఫైర్

Telangana Cabinet Expansion Tpcc Executive Committee Cm Revanth Rahul Gandhi

Cabinet Expansion:  తెలంగాణ రాష్ట్ర మంత్రివర్గ విస్తరణ, పీసీసీ కార్యవర్గం ఎంపిక మరోసారి వాయిదాపడింది. సోమవారం(మే 26న) రాత్రికల్లా దీనిపై ప్రకటన వెలువడాల్సి ఉండగా.. కాంగ్రెస్‌ చీఫ్ మల్లికార్జున ఖర్గే ఢిల్లీలో అందుబాటులో లేనందున ఈ ప్రక్రియను మే 30వ తేదీకి వాయిదా వేశారు. సోమవారం రోజు కాంగ్రెస్ అగ్రనేత రాహుల్‌గాంధీతో టీపీసీసీ చీఫ్ మహేశ్‌కుమార్‌గౌడ్‌ భేటీ అయ్యారు. ఇక సీఎం రేవంత్, మహేశ్‌కుమార్‌గౌడ్‌ కలిసి కాంగ్రెస్ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్‌తో సమావేశమయ్యారు.  ఖర్గేతో ఈ నెల 30న సమావేశం ఉంటుందని, ఆ రోజున మళ్లీ ఢిల్లీకి రావాలని రేవంత్‌, మహేశ్‌‌లకు కాంగ్రెస్ హైకమాండ్ సూచించింది. దీంతో అదే రోజు మంత్రివర్గం, పీసీసీ కార్యవర్గ నేతల పేర్లను ఖరారు చేస్తారనే టాక్ వినిపిస్తోంది.

Also Read :Viral : ఫ్రాన్స్ అధ్యక్షుడిని చెంప దెబ్బ కొట్టిన భార్య..?

పలువురు సీనియర్లపై రాహుల్ ఫైర్ 

పీసీసీ రాష్ట్ర కార్యవర్గం ఎంపిక, కూర్పులో కొత్తతరం నేతలకు అత్యధిక ప్రాధాన్యత ఇవ్వాలని రేవంత్, మహేశ్‌కుమార్‌గౌడ్‌‌లకు రాహుల్‌గాంధీ(Cabinet Expansion) సూచించినట్లు సమాచారం. తొలిసారి ఎమ్మెల్యేలుగా ఎన్నికైన వెడ్మ బొజ్జు, పర్నికారెడ్డి, వంశీకృష్ణ, నాయిని రాజేందర్‌రెడ్డి, ఎమ్మెల్సీ బల్మూరి వెంకట్‌ వంటి యువతరం నేతలకు రాష్ట్ర ఉపాధ్యక్ష పదవులు ఇవ్వాలని భావిస్తున్నట్లు సమాచారం. గతంలో సీనియర్‌ ఉపాధ్యక్షులు, వర్కింగ్‌ ప్రెసిడెంట్లు, ఉపాధ్యక్షులుగా నియమితులైన పలువురు సీనియర్‌ నేతలు కనీసం గాంధీభవన్‌లో కేటాయించిన గదులకు కూడా వెళ్లలేదని రాహుల్ గాంధీ చెప్పినట్లు తెలుస్తోంది. సీనియర్‌ అనే పేరుతో కాకుండా.. పనితీరే గీటురాయిగా పార్టీ పదవులను ఇవ్వాలని ఆయన చెప్పారట.

Also Read :Mysore Sandal Soap: మైసూర్​ శాండిల్​ సబ్బు పుట్టుకకు వరల్డ్ వార్ 1తో లింక్.. ఏమిటది ?

టీపీసీసీ కార్యవర్గంలో వీరికి ఛాన్స్