Maheshwar Reddy : తెలంగాణ బీజేపీలో కీలక నేతల మధ్య గ్యాప్ ఏర్పడిందా ? కొత్తగా వచ్చిన నేతలు, చాలా ఏళ్లుగా పార్టీలో ఉన్న సీనియర్ నేతల మధ్య సయోధ్య సాధ్యం కావడం లేదా ? అనే అంశాలపై ఇప్పుడు అంతటా చర్చ జరుగుతోంది. ప్రస్తుతం బీజేఎల్పీ నేతగా ఉన్న ఏలేటి మహేశ్వర్రెడ్డి సైలెంట్ మోడ్లోకి వెళ్లారనే ప్రచారం జరుగుతోంది. బీజేఎల్పీ నేతగా కీలక హోదాలో ఉన్నప్పటికీ తనకు పార్టీలో తగిన ప్రాధాన్యత దక్కడం లేదనే అభిప్రాయంలో ఏలేటి ఉన్నట్లు తెలుస్తోంది. ఇటీవలే బీజేపీ హైకమాండ్ జారీ ఒక ఆదేశం వల్లే ఆయన నిరాశకు లోనయ్యారని సమాచారం.
Maheshwar Reddy : బీజేఎల్పీ నేత ఏలేటి మహేశ్వర్రెడ్డి అలక.. కారణం అదే ?
