Telangana: టికెట్ దక్కకపోవడంతో శ్రీవాణి తీవ్ర అసంతృప్తి

బీజేపీ టికెట్ ఆశించి భంగపడ్డ ఆశావహులు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు.ఈరోజు బీజేపీ తమ అభ్యర్థుల మూడో జాబితాను విడుదల చేసింది. సనత్‌నగర్‌కు చెందిన బిజెపి కార్పొరేటర్ మరియు బిసి నాయకురాలు ఆకుల శ్రీవాణికి బీజేపీ పార్టీ టికెట్ కేటాయించకపోవడంతో తీవ్ర అసంతృప్తి

Telangana: బీజేపీ టికెట్ ఆశించి భంగపడ్డ ఆశావహులు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు.ఈరోజు బీజేపీ తమ అభ్యర్థుల మూడో జాబితాను విడుదల చేసింది. సనత్‌నగర్‌కు చెందిన బిజెపి కార్పొరేటర్ మరియు బిసి నాయకురాలు ఆకుల శ్రీవాణికి బీజేపీ పార్టీ టికెట్ కేటాయించకపోవడంతో తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసింది.ఎల్‌బి నగర్‌ నియోజకవర్గం టికెట్న సామ రంగారెడ్డికి ఇవ్వడంతో అసంతృప్తి వ్యక్తంచేసింది. తన నిరుత్సాహాన్ని వ్యక్తం చేస్తూ శ్రీవాణి ట్విట్టర్ ఎక్స్‌లో పోస్ట్ చేసింది.

శ్రీవాణి రాజకీయంగా క్రియాశీలకంగా ఉన్న ఎల్‌బీ నగర్ నియోజకవర్గం నుంచి టికెట్ ఆశించారు. ఆమె సోషల్ మీడియా ద్వారా ప్రజల్లో అభిమానం చూరగొన్నారు. గతంలో గవర్నర్‌పై ఎమ్మెల్సీ కౌశిక్‌రెడ్డి చేసిన వ్యాఖ్యలపై ఆమె ఫిర్యాదు చేయడం ద్వారా హైలెట్ అయ్యారు. గతంలో బీజేపీపై కేసీఆర్, కేటీఆర్ చేసిన వ్యాఖ్యలపై ఆందోళన వ్యక్తం చేసింది. మరోవైపు ఎల్‌బీ నగర్ నియోజకవర్గ బీజేపీ అధ్యక్షుడిగా సామ రంగారెడ్డి ఉన్నారు. నియోజకవర్గంలో 5 లక్షలకు పైగా ఓటర్లు ఉన్నారు.

Also Read: Kasani : రేపు బీఆర్ఎస్‌లో చేరనున్న కాసాని.. గోషామ‌హల్ నుంచి పోటీ..?