Revanth: రేవంత్ పై ఆసత్య ప్రచారం.. పోలీసులకు ఫిర్యాదు!

సామాజిక మాధ్యమాల్లో కాంగ్రెస్‌ పార్టీ (Congress Party)పై తప్పుడు ప్రచారం చేస్తున్న వారిపై ఆ పార్టీ నాయకులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. పీసీసీ అధ్యక్షుడు రేవంత్​రెడ్డి (Revanth Reddy) 'తెలంగాణ సామాజిక పార్టీ' పెడుతున్నట్లు జర్నలిస్టు శంకర్‌ పేరు మీద ట్విటర్‌ ద్వారా ట్వీట్‌ చేయడాన్ని కాంగ్రెస్ ​పార్టీ తీవ్రంగా పరిగణించింది.

  • Written By:
  • Publish Date - December 27, 2022 / 08:26 AM IST

సామాజిక మాధ్యమాల్లో కాంగ్రెస్‌ పార్టీ (Congress Party)పై తప్పుడు ప్రచారం చేస్తున్న వారిపై ఆ పార్టీ నాయకులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. పీసీసీ అధ్యక్షుడు రేవంత్​రెడ్డి (Revanth Reddy) ‘తెలంగాణ సామాజిక పార్టీ’ పెడుతున్నట్లు జర్నలిస్టు శంకర్‌ పేరు మీద ట్విటర్‌ ద్వారా ట్వీట్‌ చేయడాన్ని కాంగ్రెస్ ​పార్టీ తీవ్రంగా పరిగణించింది. కాంగ్రెస్ పార్టీపైన, నాయకులపైన దుష్ప్రచారం చేస్తూ సోషల్ మీడియాలో ప్రచారం చేస్తే చట్టపరంగా చర్యలు తీసుకోవాలని పీసీసీ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ మహేశ్‌కుమార్‌ గౌడ్‌, పీసీసీ ఉపాధ్యక్షుడు చామల కిరణ్‌ కుమార్​ రెడ్డి, తెలంగాణ కాంగ్రెస్‌ ఎస్సీ సెల్‌ ఛైర్మన్‌ ప్రీతం, కొంపల్లి 5వ వార్డు కౌన్సిలర్‌ శ్రీవిద్య ప్రశాంత్​గౌడ్‌లు పోలీసులకు ఫిర్యాదు చేశారు.