Site icon HashtagU Telugu

Renuka Chowdhury : ఖమ్మంలో 10కి 10 స్థానాలు గెలవబోతున్నాం – రేణుక

Renuka Kmm

Renuka Kmm

రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ (Congress) గెలవబోతుందని , ఖమ్మం (Khammam) జిల్లాలో 10 కి 10 స్థానాలు సాదించబోతున్నామని ధీమా వ్యక్తం చేసారు రేణుకా చౌదరి. సోమవారం ఖమ్మంలో మాట్లాడుతూ..బిఆర్ఎస్ (BRS) పార్టీ ఫై నిప్పులు చెరిగారు. మంత్రి కేటీఆర్ (KTR) ఐటిలో కింగ్ అంటారు.. ఉద్యోగాలు మాత్రం ఇవ్వరు అంటూ రేణుక ఆగ్రహం వ్యక్తం చేసారు. దేశ భవిష్యత్తులో భాగస్వాములు కావాల్సిన యువత ఉద్యోగాలు లేక పెడదారి పడుతున్నారని అన్నారు. బీఆర్ఎస్ నేతలు అధికారం మదంతో విర్రవీగుతున్నారని పేర్కొన్నారు. ఉద్యోగ నోటిఫికేషన్లు పదే పదే ఎందుకు వాయిదా పడుతున్నాయని ప్రశ్నించారు. ఏది ఏమైనా ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ అధికారంలోకి రాబోతుందని ధీమా వ్యక్తం చేశారు.

We’re now on WhatsApp. Click to Join.

ఎంఐఎం నేతలు ఎన్ని చెప్పినా ముస్లిం సోదరులు తరలి వచ్చి కాంగ్రెస్ కు మద్దతు ఇస్తున్నారని … ఈరోజు అజారుద్దీన్ మాకు మద్దతు ఇస్తున్నారని సంతోషం వ్యక్తం చేశారు. ఖిల్లాలో ఉన్న ముస్లిం సోదరుల వద్దకు వెళ్తున్నామన్నారు. ఖిల్లాను కోట్ల రూపాయలతో అభివృద్ధి చేశానని, జిల్లాలో చేపల పెంపకాన్ని ఏర్పాటు అంటే నా వల్లనే అని , ఖమ్మం రైల్వే స్టేషన్ ను అభివృద్ధి చేసింది నేనే అని, ఖమ్మం నుంచి గార్ల వరకు రైల్వే స్టేషన్ లు అభివృద్ధి చేసింది కూడా తానే అని రేణుక చెప్పుకొచ్చింది.

పేదవాడికి నిజమైన ఇల్లు ఉందంటే.. కాంగ్రెస్ పార్టీ కేటాయించిన ఇందిరమ్మ ఇల్లు అనే చెప్పాలి. టీడీపీ వాళ్లు మాకు మద్దతు ఇస్తున్నారు. కాంగ్రెస్ పార్టీని ప్రజలు ఆదరిస్తున్నారు. పదేళ్ల బీఆర్ఎస్ ప్రభుత్వానికి సాగనంపాలనే కాంగ్రెస్ కి మద్దతు పలుకుతున్నారని వెల్లడించారు రేణుకా చౌదరి.

Read Also : Telangana Polls : మళ్లీ బీఆర్ఎస్ గెలిస్తే ప్రజల చేతికి చిప్పే – కిషన్ రెడ్డి

 

Exit mobile version