లోక్ సభ (Lok Sabha) ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో పోలీసులు నిఘా పెంచారు. ఈ క్రమంలో కరీంనగర్(Karimnagar)లోని ప్రతిమ మల్టీప్లెక్స్ (Pratima Multiplex ) లో పెద్ద ఎత్తున డబ్బులు దాచారనే సమాచారం మేరకు పోలీసులు తనిఖీలు చేశారు. శుక్రవారం అర్ధరాత్రి దాటిన తర్వాత మల్టీప్లెక్స్లో సోదాలు మొదలుపెట్టిన పోలీసులు.. శనివారం ఉదయం వరకు కొనసాగించారు. ఈ తనిఖీల్లో రూ.6.65 కోట్ల నగదుని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. సీజ్ చేసిన నగదు మొత్తాన్ని పోలీసులు కోర్టులో డిపాజిట్ చేయనున్నారు.
We’re now on WhatsApp. Click to Join.
ఈ ప్రతిమ మల్టీప్లెక్స్ కరీంనగర్ బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థి వినోద్ కుమార్ (BRS MP Candidate Vinod Kumar) కుటుంబ సభ్యులకు చెందింది. దీంతో ఈ డబ్బు వినోద్ కు చెందిందే అని అంటున్నారు. లోక్ సభ ఎన్నికలు సమీపిస్తుండడం తో డబ్బు ను ఇక్కడ దాచారని అంటున్నారు. లోక్సభ ఎన్నికలకు సంబంధించి మరికొద్ది గంటల్లో నోటిఫికేషన్ విడుదల కానుంది. ఈ నేపథ్యంలో కరీంనగర్లో నగదు పట్టుబడటం కలకలం రేపుతోంది. ఇక ఈ సోదాల్లో నగదు పట్టుబడటంతో సీపీ అభిషేక్ మహంతి అక్కడికి వెళ్లారు. పోలీసులు సీక్రెట్గానే ఈ తనిఖీలు చేశారు. ఇక డబ్బులను సీజ్ చేసినట్లుగా కరీంనగర్ టౌన్ ఏసీపీ నరేందర్ ధృవీకరించారు.
In a late-night operation, @TelanganaCOPs conducted a raid at Prathima multiplex in Karimnagar, owned by relatives of @BRSparty MP candidate @vinodboianpalli , seizing over ₹6.6 crore in cash. The search, starting at 1:30 AM, stretched into the morning, spotlighting the venue… pic.twitter.com/J2mCuJJoUO
— dinesh akula (@dineshakula) March 16, 2024
Read Also : Ayodhya Ram Temple : అయోధ్య రామమందిరం నిర్మాణ పనుల కొత్త అప్డేట్స్