Site icon HashtagU Telugu

CBN-Pawan : చంద్రబాబు తో ముగిసిన పవన్ భేటీ..

Pawan Babu

Pawan Babu

సోమవారం సీఎం చంద్రబాబు నాయుడు (CHandrababu) తో డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ (Pawan Kalyan) సమావేశమయ్యారు. దాదాపు రెండు గంటల పాటు సాగిన ఈ చర్చలో పలు ముఖ్యాంశాలు ప్రస్తావనకు వచ్చాయి. ముఖ్యంగా కాకినాడ పోర్టు ద్వారా జరుగుతున్న రేషన్ బియ్యం, అక్రమ రవాణా అంశంపై ప్రత్యేకంగా చర్చించడం జరిగింది. ఈ సమస్యను నిరోధించేందుకు తీసుకోవాల్సిన చర్యలపై సుదీర్ఘంగా చర్చించారు. అలాగే అమరావతి రాజధాని నిర్మాణ పనులు వేగవంతం చేయాల్సిన అవసరం, ఇప్పటి వరకు నిర్మాణాల్లో ఎదురైన సమస్యలను పరిష్కరించడం, అమరావతి అభివృద్ధి విషయంలో పూర్తి దృష్టి పెట్టడం ద్వారా రాష్ట్రానికి మెరుగైన పెట్టుబడులు మరియు మౌలిక వసతులు కల్పించవచ్చని చంద్రబాబు కు పవన్ సూచించారు.

ఇక నామినేటెడ్ పోస్టుల కేటాయింపు పై కూడా సమావేశంలో చర్చించారు. కూటమి పార్టీల్లో కష్టపడి పనిచేస్తున్న నేతలకు న్యాయం చేయాలని పవన్ కోరగా, దీనికి చంద్రబాబు సానుకూలంగా స్పందించినట్టు సమాచారం. కేటాయింపుల్లో పారదర్శకత ఉండాలని, వర్గపరమైన మరియు ప్రాంతీయ సమతుల్యత పాటించాలని నిర్ణయించుకున్నారు.

పవన్ కల్యాణ్ తన ఢిల్లీ పర్యటన వివరాలను చంద్రబాబుతో పంచుకోవడం మరో ముఖ్య అంశంగా మారింది. కేంద్ర మంత్రులతో భేటీ వివరాలను వివరించడంలోపాటు, రాష్ట్రానికి అవసరమైన నిధులపై కేంద్ర ప్రభుత్వానికి ఒత్తిడి తెచ్చే ప్రయత్నాలు చేయాలని సూచించారు. తాజా రాజకీయ పరిస్థితుల గురించి కూడా ఇరువురి మధ్య సమగ్ర చర్చ జరిగినట్టు తెలుస్తోంది. ఈ సమావేశం నుంచి వచ్చిన నిర్ణయాలు రాష్ట్ర రాజకీయాల్లో కీలక ప్రభావం చూపే అవకాశముంది. కాకినాడ రేషన్ బియ్యం అక్రమ రవాణా నియంత్రణ, అమరావతి అభివృద్ధి, నామినేటెడ్ పోస్టుల కేటాయింపులు తదితర అంశాలు సరైన దిశగా నడిస్తే, రాష్ట్రానికి మేల్కొలిపే పరిణామాలు చోటుచేసుకుంటాయని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.

Read Also : Space Junk : ‘స్పేస్’ జామ్.. భూకక్ష్యలో భారీగా శాటిలైట్లు, అంతరిక్ష వ్యర్థాలు