BRS : బిఆర్ఎస్ ను నడిపించే చరిష్మా కేసీఆర్ కు మాత్రమే ఉంది – TPCC చీఫ్ మహేష్

BRS : భారత్ రాష్ట్ర సమితి (BRS) భవిష్యత్తుపై కీలక వ్యాఖ్యలు చేశారు. మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్‌కు ఉన్న చరిష్మా, ఆయన కుటుంబంలో మరెవ్వరికీ లేదని మహేశ్ అన్నారు

Published By: HashtagU Telugu Desk
Quit India Movement..The foundation of the Congress movement: TPCC President Mahesh Kumar Goud's comments

Quit India Movement..The foundation of the Congress movement: TPCC President Mahesh Kumar Goud's comments

తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ గ్రాఫ్ గణనీయంగా పెరిగిందని TPCC చీఫ్ మహేశ్ ధీమా వ్యక్తం చేశారు. మీడియా చిట్చాట్‌లో పాల్గొన్న ఆయన, భారత్ రాష్ట్ర సమితి (BRS) భవిష్యత్తుపై కీలక వ్యాఖ్యలు చేశారు. మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్‌కు ఉన్న చరిష్మా, ఆయన కుటుంబంలో మరెవ్వరికీ లేదని మహేశ్ అన్నారు. ముఖ్యంగా బిఆర్ఎస్ పార్టీని నడపడం కేటీఆర్‌కు సాధ్యం కాదని, BRS పార్టీని హరీశ్ రావు చీల్చే అవకాశం ఉందని సంచలన వ్యాఖ్యలు చేశారు.

Mowgli First Day Collection : రోషన్ కనకాల ‘మోగ్లీ’ ఫస్ట్ డే కలెక్షన్స్

BRS భవిష్యత్తుపై అనుమానాలు వ్యక్తం చేస్తూ ఆ పార్టీకి నిజంగా ఫ్యూచర్ ఉంటే కవిత ఎందుకు బయటకు వచ్చి కొత్త ప్రయత్నాలు చేస్తారని మహేశ్ ప్రశ్నించారు. ప్రస్తుతం కేటీఆర్ డబ్బులు పెట్టి సోషల్ మీడియా ద్వారానే పార్టీని నడిపిస్తున్నారని ఆయన ఆరోపించారు. కేసీఆర్ వారసత్వ బలం లేకపోవడం, అంతర్గత విభేదాలు, కేటీఆర్ నిర్వహణా సామర్థ్యం లోపించడం వంటి అంశాలు BRS పతనానికి దారితీస్తాయని TPCC చీఫ్ అంచనా వేశారు. ఈ పరిణామాలన్నీ రాష్ట్రంలో కాంగ్రెస్ బలపడటానికి దోహదపడుతున్నాయని ఆయన పేర్కొన్నారు.

మరోవైపు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టాలని ఎంత ప్రచారం చేసినా, పారిశ్రామికవేత్తలు, పెట్టుబడిదారులు హైదరాబాద్ వైపుకే మొగ్గు చూపుతున్నారని మహేశ్ అన్నారు. హైదరాబాద్ కు ఉన్న బలం, మౌలిక వసతులు పెట్టుబడులను ఆకర్షిస్తున్నాయని, ఇది తెలంగాణకు శుభపరిణామమని ఆయన తెలిపారు. మొత్తంగా రాష్ట్రంలో కాంగ్రెస్ అనుకూల పవనాలు వీస్తున్నాయని, BRS అంతర్గత సమస్యల కారణంగా బలహీనపడుతోందని మహేశ్ వ్యాఖ్యానించారు.

Actor Akhil Viswanath : మలయాళ నటుడు ఆత్మహత్య!

  Last Updated: 14 Dec 2025, 06:27 PM IST