NTRs Birth Anniversary : ఈరోజు (మే 28న) తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకుడు ఎన్టీఆర్ జయంతి. ఈ సందర్భంగా హైదరాబాద్లోని ఎన్టీఆర్ ఘాట్ వద్ద జూనియర్ ఎన్టీఆర్, కల్యాణ్రామ్లు నివాళులు అర్పించారు. తెలుగు జాతికి ఎన్టీఆర్ చేసిన సేవలను వారు గుర్తుచేసుకున్నారు. జూనియర్ ఎన్టీఆర్, కల్యాణ్రామ్లు ఒకే కారులో వచ్చారు. ఎన్టీఆర్ సమాధి వద్ద పుష్పగుచ్ఛాలు సమర్పించి నివాళులు అర్పించారు. తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకుడు నందమూరి తారక రామారావు జయంతిని పురస్కరించుకుని నివాళులు అర్పించేందుకు ఎంతోమంది ప్రముఖులు ఎన్టీఆర్ ఘాట్(NTRs Birth Anniversary)కు తరలి వస్తున్నారు. ఎన్టీఆర్ ఘాట్ వద్దకు ప్రముఖుల రాక సందర్భంగా పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాట్లు చేశారు. ఈ సందర్భంగా ఘాట్ పరిసరాలను ప్రత్యేకంగా అలంకరించారు.
Also Read :Investment : కుప్పంలో భారీ కంపెనీలు ఇన్వెస్ట్మెంట్ 8 వేల మందికి ఉపాధి
రాష్ట్ర ప్రభుత్వ వేడుకగా ఎన్టీఆర్ జయంతి
ఎన్టీఆర్ జయంతి సందర్బంగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం గుడ్ న్యూస్ వినిపించింది. ఇకపై ఏటా మే 28న ఎన్టీఆర్ జయంతిని రాష్ట్ర ప్రభుత్వ వేడుకగా నిర్వహించుకోవాలని పేర్కొంటూ జీవోను జారీచేసింది. ఎన్టీఆర్ అసాధారణ జీవితం, దూరదృష్టితో కూడిన ఆయన నాయకత్వంతో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంపై తిరుగులేని ముద్రవేశారని ప్రభుత్వం పేర్కొంది. ఎన్టీఆర్ తెలుగువారి ఆత్మ గౌరవానికి చిహ్నంగా నిలిచారని, ప్రజలకు, సినీ, రాజకీయ రంగాలకు ఎంతో సేవ చేశారని కొనియాడింది.
Also Read :Annadata Sukhibhava: ఖాతాల్లోకి రూ. 20 వేలు.. మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండిలా!
నందమూరి తారక రామారావు గురించి..
- నందమూరి తారక రామారావు 1949లో ‘మనదేశం’ మూవీతో సినిమా ఇండస్ట్రీలోకి వచ్చారు.
- ఎన్టీఆర్ దాదాపు 300కుపైగా సినిమాల్లో నటించారు.
- పౌరాణిక పాత్రల్లో రామారావు దరిదాపుల్లోకి వచ్చే నటుడు ఎవరూ లేరంటే అతిశయోక్తి కాదు.
- రాముడు, కృష్ణుడు, కర్ణుడు, దుర్యోధనుడు వంటి పురాణ పాత్రలతో ప్రేక్షకుల మనసుల్లో ఎన్టీఆర్ చెరగని ముద్ర వేశారు.
- “మాయాబజార్”, “పాతాళభైరవి”, “దాన వీర శూర కర్ణ” వంటి మూవీలు ఎన్టీఆర్ ప్రతిభకు తార్కాణాలు.
- ఎన్టీఆర్ 1982లో తెలుగుదేశం పార్టీని స్థాపించారు.
- 1983 ఎన్నికల్లో టీడీపీ ఘన విజయం సాధించగా, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి తొలి కాంగ్రెసేతర ముఖ్యమంత్రిగా ఎన్టీఆర్ ఎన్నికయ్యారు.