MP Arvind: కేసీఆర్ నీకు దమ్ముంటే ఆ పని చేయ్…!!

  • Written By:
  • Publish Date - November 29, 2022 / 06:37 PM IST

అధికార టీఆర్ఎస్ ను మరోసారి టార్గెట్ చేసింది తెలంగాణ బీజేపీ. ఛాన్స్ దొరికితే చాలు తీవ్రస్థాయిలో విరచుకుపడుతున్నారు. ఆదివారం బండిసంజయ్ జగిత్యాల జిల్లాలో అడ్డుకోవడంతో ఈ రచ్చ మొదలైంది. ప్రజాసంగ్రామయాత్రను అడ్డుకునేందుకు అధికారపార్టీ ప్రయత్నాలు చేస్తుదంటూ బీజేపీ అగ్రనేతలు మండిపడుతున్నారు. కోర్టు ఆదేశాలతో పాదయాత్రను ప్రారంభించిన బండిసంజయ్…ఇవాళ భైంసాలో భారీ బహిరంగసభను నిర్వహించారు. ఈ సభలో నిజామాబాద్ ఎంపీ అర్వింద్ అధికారపార్టీ, సీఎం కేసీఆర్ పై తీవ్రస్థాయిలో మండిపడ్డారు. కొందరు అధికారులు టీఆర్ఎస్ కార్యకర్తల వలే పనిచేస్తున్నారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు.

ఈసారి అసెంబ్లీ ఎన్నికల్లో ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో బీజేపీ క్లిన్ స్వీప్ చేస్తుందన్నారు. సీఎం కేసీఆర్ అసెంబ్లీని రద్దు చేసిన వెంటనే రాష్ట్రంలో రాష్ట్రపతి పాలన ఏర్పడుతుదంన్నారు. దీనికి గవర్నర్ కూడా సిద్ధంగా ఉన్నారన్నారు అర్వింద్. సీఎం కేసీఆర్ నీకు దమ్ముంటే…అసెంబ్లీ రద్దు చేసి ఎన్నికలకు వెళ్లాలంటూ సవాల్ విసిరారు. నిజాలు మాట్లాడినందుకే మాపై దాడులు చేశారని ఆగ్రహంవ్యక్తం చేశారు. తెలంగాణలో బీజేపీ ఎదుగుదలను చూసి ఓర్వలేకే పిచ్చి రాజకీయాలు చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. పేదల పైసలు తిన్న ఓ ఒక్కరినీ వదిలిపెట్టే ప్రసక్తే లేదని తాము అధికారంలోకి వచ్చిన తర్వాత అందరిపని చెబుతామన్నారు. పేదలపైసల తిన్నవారి జాబితా తమ వద్ద ఉందని ఓ ఒక్కరిని వదిలిపెట్టదని ఈ మధ్యే బేగంపేటలో నిర్వహించిన సభలో ప్రదాని మోదీ చెప్పినట్లు ఎంపీ అర్వింద్ గుర్తు చేశారు