Site icon HashtagU Telugu

Meenakshi Natarajan : మీనాక్షి నటరాజన్ ఎవరు ? ఆమె మొదటి టార్గెట్ అదేనా ?

Meenakshi Natarajan Telangana Congress New Incharge

Meenakshi Natarajan : మీనాక్షి నటరాజన్‌.. తెలంగాణ కాంగ్రెస్‌కు కొత్త ఇంఛార్జిగా నియమితులు అయ్యారు. ఇప్పటివరకు ఆమె కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ టీమ్‌లో విధులు నిర్వర్తించారు. తెలంగాణలో స్థానిక సంస్థల ఎన్నికలు సమీపించిన వేళ రాహుల్‌గాంధీ ప్రత్యేక శ్రద్ధతో మీనాక్షి నటరాజన్‌కు ఈ ముఖ్యమైన బాధ్యతలను అప్పగించారు. ఇంతకీ మీనాక్షి ఎవరు ? ఆమె నేపథ్యం ఏమిటి ?

Also Read :Cabinet Expansion : మంత్రివర్గ విస్తరణ ను రాహుల్ నేడు ఫైనల్ చేస్తాడా..?

మీనాక్షి నటరాజన్‌ నేపథ్యం ఇదీ.. 

  • మీనాక్షి నటరాజన్(Meenakshi Natarajan) మధ్యప్రదేశ్‌లోని ఉజ్జయినిలో 1973 జులై 23న జన్మించారు.
  • ఆమె బయో కెమిస్ట్రీలో పీజీ చేశారు. ఎల్‌ఎల్‌బీ  చేశారు.
  • మధ్యప్రదేశ్‌లోని రత్లాంలో మీనాక్షి తన రాజకీయ ప్రస్థానాన్ని ప్రారంభించారు.
  • 1999–2002 వరకు ఎన్ఎస్‌యూఐ రాష్ట్ర అధ్యక్షురాలిగా మీనాక్షి పనిచేశారు.
  • 2002-2005 మధ్య కాలంలో మధ్యప్రదేశ్ యువజన కాంగ్రెస్ అధ్యక్షురాలిగా సేవలు అందించారు.
  • 2008లో ఏఐసీసీ కార్యదర్శిగా మీనాక్షి ఎంపికయ్యారు.
  • మీనాక్షి రాసిన పుస్తకాల పేర్లు “1857-Bhartiya paripeksh” “Apne-Apne Kurukshetra”.
  •  2009 లోక్‌సభ ఎన్నికల్లో మధ్యప్రదేశ్‌లోని మంద్‌సౌర్ స్థానం నుంచి పోటీ చేసే అవకాశాన్ని మీనాక్షికి రాహుల్ గాంధీ కల్పించారు. ఆ ఎన్నికల్లో 30వేల ఓట్ల మెజారిటీతో ఆమె గెలిచారు. 1971 నుంచి వరుసగా ఎన్నికల్లో గెలుస్తూ వస్తున్న బీజేపీ అభ్యర్థి లక్ష్మీనారాయణ్ పాండేను మీనాక్షి ఓడించారు.
  • 2009 యూపీఏ ప్రభుత్వంలో సర్కారీ సిబ్బంది,  ప్రజా విన్నపాలు, న్యాయశాఖ, మహిళా సాధికారతలపై ఏర్పాటు చేసిన కమిటీలో సభ్యురాలిగా మీనాక్షి వ్యవహరించారు.
  • 2014 లోక్‌సభ ఎన్నికల్లో మంద్ సౌర్ లోక్‌సభ స్థానంలో మీనాక్షి ఓడిపోయారు. అక్కడ బీజేపీ అభ్యర్థి సుధీర్ గుప్తా ఏకంగా 3 లక్షల మెజారిటీతో గెలిచారు.
  • మీనాక్షి నటరాజన్ గురించి ఒకసారి కాంగ్రెస్ సీనియర్ నేత దిగ్విజయ్ సింగ్ కీలక వ్యాఖ్యలు చేశారు. ‘‘ఎలాంటి నిందను/అపవాదును మోపలేని 100 శాతం స్వచ్ఛమైన మెటీరియల్ మీనాక్షి నటరాజన్’’ అని ఆయన చెప్పారు. దీన్నిబట్టి రాజకీయాల్లో ఆమె ఎంత సూటిగా ఉంటారో అర్థం చేసుకోవచ్చు.
  • అందుకే తెలంగాణ ఇంఛార్జిగా మీనాక్షికి కీలక బాధ్యతలను అప్పగించారు.
  • మంత్రివర్గ విస్తరణ విషయంలో తెలంగాణలోని కాంగ్రెస్ నేతల మధ్య ఏకాభిప్రాయం కుదరడం లేదు. వాటన్నింటినీ కొలిక్కి తెచ్చే చాతుర్యం మీనాక్షికి ఉంది. అందుకే ఆమెను రాహుల్ ఇక్కడికి పంపారు. తదుపరిగా ఆమె ఆ అంశంపైనే ఫోకస్ చేసే అవకాశం ఉంది.

Also Read :Shock : ఒకే రోజు 400 మందికిపైగా ఉద్యోగుల తొలగించిన ఇన్ఫోసిస్‌