Rahul Gandhi: రాహుల్ గాంధీకి ఈడీ తాజా సమన్లు.. 13న విచారణకు హాజరు కావాలంటూ పిలుపు!

  • Written By:
  • Publish Date - June 3, 2022 / 03:04 PM IST

తాజాగా ఈడీ కాంగ్రెస్ పార్టీ నాయకుడు,ఎంపీ రాహుల్ గాంధీకి సమన్లు జారీ చేసింది. రాహుల్ గాంధీ తాజాగా గురువారం రోజున ఈడీ విచారణకు హాజరు కాకపోవడంతో తిరిగి జూన్ 13వ తేదీన హాజరు కావాలి అని నోటీసు ఇచ్చింది. ప్రస్తుతం రాహుల్ గాంధీ దేశం వెలుపల ఉన్న విషయం తెలిసిందే. దేశం వెలుపల ఉన్నందువల్ల నేషనల్ హెరాల్డ్ కేసులో ఈడీ కి హాజరు కావడానికి మరింత సమయం కావాలని కోరారు రాహుల్ గాంధీ. తాజాగా ఈడీ విచారణకు హాజరు కాకపోవడం వల్లే 13వ తేదీన హాజరు కావాలి అంటూ రాహుల్ గాంధీకి సమాచారం పంపినట్లు ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ తెలిపింది.

రాహుల్ గాంధీ, సోనియాగాంధీ ఇద్దరూ భూకబ్జాల పేరుతో వేల కోట్ల రూపాయల నిధుల దుర్వినియోగానికి పాల్పడ్డారని ఆరోపిస్తూ బిజెపి మాజీ ఎంపీ సుబ్రహ్మణ్యస్వామి ఢిల్లీ హైకోర్టులో కేసు వేసిన విషయం తెలిసిందే. ఈ భూకబ్జాల పేరుతో ఢిల్లీ హైకోర్టులో కేసు వేయడంతో నేషనల్ హెరాల్డ్ వ్యవహారం కూడా తెరపైకి వచ్చింది. ప్రస్తుతం రాహుల్ గాంధీ డైరెక్టర్ గా ఉన్న యంగ్ ఇండియా లిమిటెడ్ అనే ఒక ప్రైవేట్ సంస్థ ద్వారా ఏజేఎల్ అనే పబ్లిక్ లిమిటెడ్ కంపెనీని గాంధీ లు కొనుగోలు చేశారని ఎంపీ సుబ్రమణ్యస్వామి ఆరోపించారు.

ఇదే కేసులో జూన్ 8న విచారణకు హాజరు కావాల్సిన సోనియా గాంధీ కరోనా బారిన పడిన విషయం తెలిసిందే. సోనియా గాంధీ కి కరోనా పాజిటివ్ గా నిర్ధారణ అయినట్లు కాంగ్రెస్ అధికార ప్రతినిధి అయిన రణదీప్ సూర్జెవాలా తెలిపారు. అదేవిధంగా మనీలాండరింగ్ నిరోధక చట్టం పిఎంఎల్ఎ లోని పలు క్రిమినల్ సెక్షన్ల కింద వారిద్దరి వాంగ్మూలాలు నమోదు చేయనున్నట్లు తెలుస్తోంది.