ప్రతిష్ఠాత్మకమైన మిస్ వరల్డ్ 2025 (Miss World 2025)పోటీలపై మిస్ ఇంగ్లండ్ మిల్లా మాగీ (Milla Magee) చేసిన ఆరోపణలపై బీఆర్ఎస్ నేత, మాజీ మంత్రి కే.టి. రామారావు (KTR) తీవ్రంగా స్పందించారు. ఈ పోటీల సందర్భంగా మిల్లా మాగీ ఎదుర్కొన్న అవమానం తనను బాధించిందని తెలిపారు. అంతటి అంతర్జాతీయ వేదికపై జరిగిన అన్యాయాన్ని బహిర్గతం చేయడం ఎంతో ధైర్యానికి నిదర్శనమని కేటీఆర్ పేర్కొన్నారు. ఈ ఆరోపణలపై సమగ్ర విచారణ చేపట్టాలని కేంద్రం మరియు సంబంధిత సంస్థలను డిమాండ్ చేశారు.
House Warming : చంద్రబాబు ఫ్యామిలీ గృహప్రవేశం.. అతిథులకు అద్భుతమైన వంటకాలు
ఇదే అంశంపై బీఆర్ఎస్ నేత, మాజీ మంత్రి సబితా ఇంద్రారెడ్డి కూడా కాంగ్రెస్ ప్రభుత్వాన్ని విమర్శించారు. తెలంగాణలో మిస్ వరల్డ్ వంటి ఘనమైన ఈవెంట్ను నిర్వహించే బాధ్యతను ప్రభుత్వం చేపట్టిన నేపథ్యంలో, ఇలాంటి అవాంఛనీయ ఘటనలు రాష్ట్ర గౌరవాన్ని కించపరిచే విధంగా మారాయన్నారు. మిల్లా మాగీ ఎదుర్కొన్న అనుభవాలు తెలంగాణ రాష్ట్రానికి మచ్చతెచ్చేలా తయారయ్యాయని పేర్కొన్నారు. దీనిపై తక్షణమే చర్యలు తీసుకుని, వాస్తవాలు వెలుగులోకి తేవాలని ఆమె డిమాండ్ చేశారు.
మరోవైపు, మిస్ వరల్డ్ పోటీల నిర్వహకులు మిల్లా మాగీ ఆరోపణలను ఖండిస్తూ ఇప్పటికే స్పష్టమైన ప్రకటన చేశారు. ఆమె ఆరోపణల్లో నిజం లేదని, పోటీలను పకడ్బందీగా, న్యాయంగా నిర్వహించామని తెలిపారు. అయినప్పటికీ, రాజకీయ వర్గాల్లో ఈ విషయంపై చర్చ తీవ్రతరం కావడంతో, ఇది రాజకీయంగా మరింత ఉద్రిక్తతకు దారితీయనుంది. మిల్లా ఆరోపణలు నిజమా? లేక అది వ్యక్తిగత అనుభూతుల ప్రభావమేనా? అన్నది త్వరలో స్పష్టతకు వచ్చే అవకాశముంది.