Malla Reddy Reacts: తాగితే తప్పేంటి? మందు పార్టీపై మల్లారెడ్డి రియాక్షన్!

మునుగోడులో ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న టీఆర్‌ఎస్ మంత్రి మల్లారెడ్డి తన అనుచరులతో కలిసి మద్యం సేవిస్తున్నట్లు

  • Written By:
  • Updated On - October 10, 2022 / 02:52 PM IST

మునుగోడులో ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న టీఆర్‌ఎస్ మంత్రి మల్లారెడ్డి తన అనుచరులతో కలిసి మద్యం సేవిస్తున్నట్లు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఫోటోపై స్పందించారు. మంత్రి మల్లారెడ్డి మీడియాతో మాట్లాడుతూ.. రెడ్డిబావిలోని బంధువుల నుంచి ఆహ్వానం అందడంతో వెళ్లి తన అన్నదమ్ములకు మందు పార్టీ ఇచ్చానని అన్నారు. బంధువులకు మద్యం అందించడం తప్పా అని ప్రశ్నించారు. విలేకరుల ప్రశ్నకు మంత్రి మల్లారెడ్డి స్పందిస్తూ.. ఈ అంశంపై సీబీఐతో విచారణ జరిపించాలని సెటైరికల్ కామెంట్స్ చేశారు. బీజేపీ నేతలు కావాలనే ట్రోల్స్‌కు పాల్పడుతున్నారని మండిపడ్డారు.

మునుగోడు నియోజకవర్గంలో ప్రచారానికి వెళ్లిన మంత్రి మల్లారెడ్డి.. ప్రచారం తర్వాత తన అనుచరులతో మందు తాగుతూ బుక్కైపోయారు. ఫుల్ బాటిల్ ను పట్టుకుని గ్లాసులో మందు పోస్తున్న మల్లారెడ్డి విజువల్స్ సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. మల్లారెడ్డి ఫుల్ బాటిల్ లిక్కర్ విజువల్ ను బీజేపీ, కాంగ్రెస్ కార్యకర్తలు ఫుల్ గా వైరల్ చేస్తున్నారు.

వివరాల్లోకి వెళితే మంత్రి మల్లారెడ్డిని చౌటుప్పల్ మండలం ఆరెగూడెం గ్రామానికి ఎన్నికల ఇంచార్జ్ గా ఉన్నారు. ఆదివారం గ్రామానికి వెళ్లిన మల్లారెడ్డి.. పార్టీ కార్యకర్తలతో కలిసి రోజంతా ప్రచారం చేశారు. ఇంటింటికి వెళ్లి కారు గుర్తుకు ఓటేయాలని అభ్యర్థించారు. తర్వాత హైదరాబాద్ పయనమయ్యారు. కాసేపటికి సీన్ కట్ చేస్తే చౌటుప్పల్ గ్రామ శివారులోని ఓ హోటల్ లో మంత్రి మల్లారెడ్డి తన అనుచరులతో మందు పార్టీ చేసుకున్నారు. తనతో వచ్చిన నేతలతో పాటు లోకస్ కేడర్ కు ఫుల్లుగా మందు పోశారు. కార్యకర్తలకు మంత్రి స్వయంగా మందు పోస్తూనే.. తానూ ఓ పెగ్గేశారు. మంత్రి మల్లారెడ్డి ఫుల్ బాటిల్ పట్టుకుని మందు పోస్తున్న విజువల్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.