IAS Transfers : తెలంగాణలోని సీఎం రేవంత్ సర్కారు అన్ని విభాగాల్లో బదిలీల దిశగా చకచకా నిర్ణయాలు తీసుకుంటోంది. ఇప్పటివరకు కీలక సీపీలు, ఇతర ఉన్నతాధికారులను బదిలీ చేసిన రాష్ట్ర ప్రభుత్వం.. తాజాగా పెద్దఎత్తున ఐఏఎస్ అధికారులను బదిలీ చేసింది. 11 మంది ఐఏఎస్ అధికారులను బదిలీ చేస్తూ సీఎస్ శాంతికుమారి ఉత్తర్వులు జారీ చేశారు. కళాశాల, సాంకేతిక విద్యాశాఖ కమిషనర్ గా బుర్రా వెంకటేశంకు అడిషనల్ బాధ్యతలు అప్పగించారు. విద్యాశాఖ ప్రిన్సిపల్ సెక్రటరీగా బుర్రా వెంకటేశం వ్యవహరించనున్నారు.
We’re now on WhatsApp. Click to Join.
తెలంగాణ ప్రభుత్వం అంతకుముందు తొమ్మిది మంది ఐఏఎస్లకు పోస్టింగ్లు ఇచ్చింది. వీరిలో హనుమకొండ అడిషనల్ కలెక్టర్గా రాధికా గుప్తా, మహబూబ్నగర్ అడిషనల్ కలెక్టర్గా శివేంద్ర ప్రతాప్, ములుగు అడిషనల్ కలెక్టర్గా పి. శ్రీజ, నిర్మల్ అడిషనల్ కలెక్టర్గా ఫైజాన్ అహ్మద్, మహబూబాబాద్ అడిషనల్ కలెక్టర్గా లెనిన్ వత్సల్ తొప్పో, జనగామ అడిషనల్ కలెక్టర్గా పర్మర్ పింకేశ్ కుమార్ లలిత్ కుమార్, జయశంకర్ భూపాలపల్లి అడిషనల్ కలెక్టర్గా కదిరవన్, రాజన్న సిరిసిల్ల అడిషనల్ కలెక్టర్గా పి. గౌతమి, వనపర్తి అడిషనల్ కలెక్టర్గా సంచిత్ గంగ్వార్ లకు పోస్టింగ్లు ఇచ్చింది. ఈ క్రమంలో కేంద్రం నుంచి రాష్ట్ర సర్వీసులకు తిరిగొచ్చిన మహిళా ఐఏఎస్ అధికారిణి ఆమ్రపాలి డిసెంబర్ 15న హెచ్ఎండీఏ జాయింట్ కమిషనర్గా బాధ్యతలు తీసుకున్నారు.