TS : ముగ్గురు TRS ఎమ్మెల్యేల హత్యకు మావోయిస్టుల ప్లాన్..!!

కనుమరుగయ్యారు అనుకున్న మావోయిస్టులు మళ్లీ...కదలికలు మొదలు పెట్టారు. ముఖ్యంగా ఉత్తర తెలంగాణలో గోదావరి తీరంలో మావోయిస్టులు ఉనికి ఎక్కువగా ఉన్నట్లు పోలీసులు గుర్తించారు.

  • Written By:
  • Publish Date - September 29, 2022 / 07:55 AM IST

కనుమరుగయ్యారు అనుకున్న మావోయిస్టులు మళ్లీ…కదలికలు మొదలు పెట్టారు. ముఖ్యంగా ఉత్తర తెలంగాణలో గోదావరి తీరంలో మావోయిస్టులు ఉనికి ఎక్కువగా ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. తెలంగాణకు చెందిన పలువురు నేతలను మావోలు టార్గెట్ చేసినట్లుగా తెలుస్తోంది. అధికారపార్టీకి చెందిన ముగ్గురు ఎమ్మెల్యేలను హత్య చేసేందుకు పక్కా స్కెచ్ వేసినట్లుగా పోలీసులకు సమాచారం అందిందట.

ఇది కూడా చదవండి:  తెలంగాణపై ఎలాంటి కఠిన చర్యలు వద్దు…కేంద్రానికి తెలంగాణ హైకోర్టు ఆదేశం..!!

ఇందులో ముగ్గురుఎమ్మెల్యేలు చెన్నం దుర్గయ్య, బాల్కసుమన్, కోరకుంటి చందర్ ను హత్యచేసేందుకు మావోయిస్టులు పక్కా స్కెచ్ వేసినట్లు నిఘా వర్గాలు గుర్తించాయి. అంతేకాదు మావోయిస్టు పార్టీకి చెందిన ముఖ్య నేతలు రాష్ట్రంలోకి ప్రవేశించారన్న పక్కా సమచారం పోలీసులకు అందిందట. అయితే ముగ్గురు ఎమ్మెల్యేల్లో ఇద్దరు దళిత ఎమ్మెల్యేలు ఉండటంతో…వారిపై దాడి చేస్తే…మావోయిస్టుల పట్ల ప్రజల్లో వ్యతిరేకత వచ్చే అవకాశం ఉండటంతో…వారిపై దాడిని విరమించుకున్నట్లు సమాచారం.

ఇది కూడా చదవండి: త్వరలోనే ఢిల్లీలో సీఎం కేసీఆర్ భారీ బహిరంగ సభ..!!

కాగా మావోయిస్టు రాష్ట్ర కమిటీ సభ్యుడు మైలారపు అడెల్లు అలియాస్ భాస్కర్, కేంద్ర కమిటీ సభ్యుడు కంకణాల రాజిరెడ్డి తెలంగాణలోకి ప్రవేశించారన్న పక్కా సమాచారం నిఘా వర్గాలకు అందిందట. ఈ క్రమంలోనే నిఘా పెంచారు పోలీసులు. గోదావరి చుట్టూ కూంబింగ్ చేపట్టారు.