తెలంగాణలో రాజకీయాలు వేడెక్కుతున్నాయి. బీఆర్ఎస్ పార్టీ (BRS Party) నుంచి గెలిచిన కొంతమంది ఎమ్మెల్యేలు కాంగ్రెస్లో చేరారని ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో వారు తమ పార్టీ మారలేదని చెప్పడంపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎమ్మెల్యేల ఫిరాయింపుల విషయంలో కాంగ్రెస్ పార్టీ తీరును ఆయన తప్పుబట్టారు. ఈ మేరకు కేటీఆర్ రాహుల్ గాంధీకి ఒక ట్వీట్ చేశారు.
Lauki Juice: సొరకాయ జ్యూస్ తాగడం వల్ల కలిగే ప్రయోజనాలు మీకు తెలుసా?
ఆయన తన ట్వీట్లో “డియర్ రాహుల్ గాంధీ.. ఈ ఫోటోను చూడండి. కాంగ్రెస్ కండువాలను, ఢిల్లీలో మిమ్మల్ని కలిసిన బీఆర్ఎస్ ఫిరాయింపు ఎమ్మెల్యేలను గుర్తుపట్టారా? ఇప్పుడు వీరు తాము పార్టీ మారలేదని, ఇది కాంగ్రెస్ కండువా కాదని అంటున్నారు. దీన్ని మీరు అంగీకరిస్తారా? ఇది ఓట్ చోరీ కాదా? మీకు సిగ్గు అనిపించడం లేదా?” అని ప్రశ్నించారు. ఈ వ్యాఖ్యలు ఇప్పుడు రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్గా మారాయి.
కాంగ్రెస్ పార్టీ తమ ఎమ్మెల్యేలను చేర్చుకోవడం ద్వారా ప్రజాస్వామ్య విలువలను కాలరాస్తోందని బీఆర్ఎస్ ఆరోపిస్తోంది. ఒకవైపు పార్టీ మారలేదని ఎమ్మెల్యేలు చెబుతుంటే, మరోవైపు వారు కాంగ్రెస్ నాయకులతో కలిసి దిగిన ఫోటోలు బయటకు వస్తున్నాయి. ఈ అంశంపై కేటీఆర్ నేరుగా రాహుల్ గాంధీని ప్రశ్నించడం ద్వారా ఈ సమస్య తీవ్రతను ఆయన మరింత పెంచినట్లయింది. ఈ వివాదం రానున్న రోజుల్లో మరింత ముదిరే అవకాశం ఉంది.
Dear @RahulGandhi,
Please take a look at this image. Can you recognise the Congress Scarf?
Do you recognise these defected BRS MLAs who had also met with you in Delhi?
Now all these MLAs who joined Congress after winning on BRS ticket are saying they didn’t switch parties… pic.twitter.com/rlIqt3YQc6
— KTR (@KTRBRS) September 12, 2025