KTR On Bandi: బండి హామీలపై ‘కేటీఆర్’ ఫైర్.. ‘స్టుపిడ్ బీజేపీ’ అంటూ కౌంటర్!

తెలంగాణ ఐటీ మినిస్టర్ బీజేపీ లక్ష్యంగా చేసుకొని ఘాటు వ్యాఖ్యలు చేశారు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్, మోడీపై నిప్పులు చెరిగారు.

  • Written By:
  • Updated On - September 15, 2022 / 01:21 PM IST

తెలంగాణ ఐటీ మినిస్టర్ బీజేపీ లక్ష్యంగా చేసుకొని ఘాటు వ్యాఖ్యలు చేశారు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్, మోడీపై నిప్పులు చెరిగారు. స్టూపిడ్ బీజేపీ అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. పేదలకు ఉచితంగా ఇళ్లు, విద్య, వైద్యం అందిస్తామన్న బండి సంజయ్‌ వ్యాఖ్యలపై తెలంగాణ కేటీఆర్‌ తీవ్రంగా స్పందించారు. బిజేపి మూర్ఖత్వం చూస్తుంటే విచిత్రంగా ఉందని, ఓ పక్క విశ్వగురువు (ప్రధాని మోడీ) ఉచితాలు వద్దని చెబుతుంటే, మరో పక్క కరీంనగర్ ఎంపీ ఉచిత విద్య, వైద్యం, ఇళ్లు ఇస్తానని హామీలు గుప్పిస్తున్నారు. ఈ దేశాన్ని బీజేపీ పాలిస్తున్నదా అని ప్రశ్నించారు. ఉచిత ఇళ్లు, విద్య, వైద్యం అందించకుండా అడ్డుకున్నదెవరు?’’ అని కేటీఆర్ ప్రశ్నించారు.

ఈ జోకర్ ఎంపీ ఉచిత విద్య, ఆరోగ్యం, ఇళ్ళు ఇస్తామని వాగ్దానం చేశాడు! ఈ దేశాన్ని పాలిస్తున్నది బీజేపీ కాదా? దేశం మొత్తానికి ఉచిత గృహాలు, విద్య & ఆరోగ్యంపై పార్లమెంటులో శాసనం చేయకుండా మిమ్మల్ని ఎవరు అడ్డుకుంటున్నారు? అని కేటీఆర్ ప్రశ్నించారు. దేశంలోని 28 రాష్ట్రాల్లో పేదలకు ఉచిత విద్య, వైద్యం, ఇళ్లు అందించేలా చట్టం తెస్తే టీఆర్‌ఎస్‌ పార్టీ సంపూర్ణ మద్దతు ఇస్తుందని కేటీఆర్‌ స్పష్టం చేశారు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు, కరీంనగర్ ఎంపీ బండి సంజయ్ జీహెచ్‌ఎంసీలో ప్రజా పోరాట యాత్ర నిర్వహిస్తున్నారు. ఈ సందర్భంగా రాష్ట్రంలోని పేదలకు ఉచితంగా ఇళ్లు, విద్య, వైద్యం అందిస్తామని హామీ ఇచ్చారు. ఈ నేపథ్యంలో మంత్రి కేటీఆర్ రియాక్ట్ అయ్యారు.