గత కొద్దీ రోజులుగా ఫార్ములా ఈ రేస్(Formula E Racing) అంశంపై రగడ నడుస్తున్న సంగతి తెలిసిందే. ఈ రేస్ లో అనేక అవకతవకలు జరిగాయని..ఈ అవకతవకల్లో భాగంగా మాజీ మంత్రి కేటీఆర్ ను అరెస్ట్(KTR Arrest ) చేయబోతున్నారని పెద్ద ఎత్తున కాంగ్రెస్ ప్రచారం చేస్తూ వస్తుంది. ఈ క్రమంలో ఈ అంశంపై అసెంబ్లీ లో చర్చ పెట్టండి అంటూ కేటీఆర్..సీఎం రేవంత్ కు సవాల్ (KTR Challenge to CM Revanth Reddy) చేసారు. ఫార్ములా ఈ రేస్ ఒప్పందం గురించి అనేక ఆరోపణలు చేస్తున్న మీ ప్రభుత్వం అసలు నిజాలు ప్రజల ముందుంచడానికి సిద్ధంగా ఉందా? అని ఆయన ప్రశ్నించారు. ఈ అంశంపై బహిరంగ చర్చ శాసనసభలో జరిగితే అందరికీ స్పష్టత వస్తుందని కేటీఆర్ తన బహిరంగ లేఖలో పేర్కొన్నారు.
కేటీఆర్ లేఖలో.. 2023లో ఫార్ములా ఈ రేస్ విజయవంతంగా నిర్వహించబడిందని, దీని ద్వారా రాష్ట్రానికి రూ. 700 కోట్ల లాభం చేకూరిందని నీల్సన్ సంస్థ నివేదికలో తెలిపిన విషయాన్ని ప్రస్తావించారు. అలాగే ఈ రేస్ హైదరాబాద్ నగరానికి మంచి పేరు తీసుకువచ్చిందని పేర్కొన్నారు. అయితే కాంగ్రెస్ ప్రభుత్వం ఈ ఒప్పందాన్ని రద్దు చేయడమే కాకుండా, దుష్ప్రచారం చేస్తూ రాజకీయ కక్షసాధింపు చర్యలకు పాల్పడుతోందని ఆరోపించారు. “ఫార్ములా ఈ ఒప్పందం పూర్తిగా పారదర్శకంగా జరిగింది” అని కేటీఆర్ స్పష్టంగా చెప్పారు. గతంలోనూ ఈ అంశంపై తగిన వివరణ ఇచ్చినప్పటికీ, ప్రభుత్వం ఇంకా ఆరోపణలు చేస్తూ ప్రజల్లో అపోహలు సృష్టిస్తోంది అని మండిపడ్డారు. మీరు నిజాయితీగా ఉంటే శాసనసభలో బహిరంగ చర్చకు రావాలని కేటీఆర్ సీఎం రేవంత్ రెడ్డిని డిమాండ్ చేశారు. ఈ అంశంపై శాసనసభ వేదికగా చర్చ జరిపితే ప్రజల ముందు పూర్తి వివరాలు బయటపడతాయని కేటీఆర్ తెలిపారు. మరి కేటీఆర్ సవాల్ ను కాంగ్రెస్ ప్రభుత్వం స్వీకరిస్తుందా..? లేదా అనేది చూడాలి.
I challenge CM Revanth Reddy to hold a discussion in the ongoing Telangana Legislative Assembly session on the Formula E Race (Hyderabad E-Prix)
Why discuss this matter for 1 and half hours in Cabinet Meeting and plant silly media leaks?
Instead of discussing within confines… pic.twitter.com/QE5IRHhrKk
— KTR (@KTRBRS) December 18, 2024
Read Also : Vijay Thalapathy : అమిత్ షా వ్యాఖ్యల పై విజయ్ దళపతి ఆగ్రహం