Hyderabad: సీనియర్ జర్నలిస్ట్ కృష్ణారావు మృతికి సీఎం కేసీఆర్ సంతాపం

సీనియర్ జర్నలిస్ట్, ఎడిటర్ సి.హెచ్.వీ.ఎం కృష్ణారావు మరణం పట్ల ముఖ్యమంత్రి కేసీఆర్ సంతాపం తెలియజేశారు. అభ్యుదయ భావాలు కలిగిన కృష్ణారావు సీనియర్ జర్నలిస్టుగా

Published By: HashtagU Telugu Desk
Hyderabad

New Web Story Copy (21)

Hyderabad: సీనియర్ జర్నలిస్ట్, ఎడిటర్ సి.హెచ్.వీ.ఎం కృష్ణారావు మరణం పట్ల ముఖ్యమంత్రి కేసీఆర్ సంతాపం తెలియజేశారు. అభ్యుదయ భావాలు కలిగిన కృష్ణారావు సీనియర్ జర్నలిస్టుగా చేసిన సేవలను సీఎం కొనియాడారు. ప్రజా ప్రయోజనాల కోణంలో కృష్ణారావు చేసిన రచనలు, విశ్లేషణలు, టీవీ చర్చలు ఆలోచన రేకెత్తించేవిగా ఉండేవని ఆయన సేవలను సీఎం కేసీఆర్ స్మరించుకున్నారు. నాలుగు దశాబ్దాలకు పైగా జర్నలిజం రంగానికి నిజాయితీగా సేవలందించిన కృష్ణారావు మరణం పత్రికా రంగానికి తీరనిలోటనికేసీఆర్ తెలిపారు. వారి ఆత్మకు శాంతి చేకూరాలని కోరుకుంటూ, వారి కుటుంబ సభ్యులకు తన ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు.

జర్నలిస్టు సీహెచ్‌వీఎం కృష్ణారావు గత ఏడాది కాలంగా క్యాన్సర్‌తో పోరాడుతూ ఈ రోజు తుదిశ్వాస విడిచారు. తనని బాగా ఇష్టపడే సహచరులు బాబాయ్ అని పిలిపించుకునేవారు. 1975లో ఈ రంగంలో తన జర్నలిజం ప్రయాణాన్ని ప్రారంభించిన ఆయన ఇంగ్లీష్ మరియు తెలుగు దినపత్రికలపై చెరగని ముద్ర వేశారు. ఈనాడు, ఆంధ్రప్రభ, ఆంధ్రభూమి, డెక్కన్ క్రానికల్ మరియు ది న్యూ ఇండియన్ ఎక్స్‌ప్రెస్‌తో సహా పేపర్‌లకు పని చేశారు. డెక్కన్ క్రానికల్ లో అతను 18 సంవత్సరాలకు పైగా పనిచేశాడు.ఆయనకు భార్య, కుమారుడు, కుమార్తె, ఇద్దరు మనుమలు ఉన్నారు.

Also Read: Land Grabbing: మంత్రి మల్లారెడ్డిపై భూకబ్జా ఆరోపణలు.. బాధితులకు ప్రాణభయం!

  Last Updated: 17 Aug 2023, 03:31 PM IST