Site icon HashtagU Telugu

Kavitha’s First Tweet : బెయిల్ ఫై విడుదలైన కవిత..తొలి ట్వీట్

Kavitha 1st Tweet

Kavitha 1st Tweet

ఢిల్లీ లిక్కర్ కేసు (Delhi Liquor Scam Case)లో అరెస్ట్ అయినా ఎమ్మెల్సీ కవిత బెయిల్ ఫై విడుదలయ్యారు. ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసు (Delhi Liquor Case)లో ఈడీ అధికారులు కవిత(BRS MLC Kavitha)ను మార్చి 15న అరెస్ట్​ చేయగా, అప్పటి నుంచి దాదాపు 5 నెలలకు పైగా ఆమె తిహాడ్‌ జైలులోనే ఉన్నారు. బెయిల్ ఫై విడుదలై హైదరాబాద్ కు చేరుకున్న కవిత కు పార్టీ శ్రేణులు ఘనస్వాగతం పలికారు. శంషాబాద్ ఎయిర్ పోర్ట్ నుండి బంజారాహిల్స్ లోని తన ఇంటి వరకు భారీగా కార్ ర్యాలీ తో స్వాగతం పలికారు. చాలారోజుల తర్వాత ఆమెను చూసిన బీఆర్‌ఎస్‌ శ్రేణులు, జాగృతి నాయకులు, మహిళలు భావోద్వేగానికి గురయ్యారు. అభిమానులు పూలవర్షం కురిపించారు. వారికి పిడికిలెత్తి జై తెలంగాణ అంటూ కవిత అభివాదం చేశారు. ఇంట్లోకి రాగానే పూజగదిలో దేవుడికి సాష్ఠాంగ నమస్కారం చేశారు. తల్లి శోభమ్మకు పాదాభివందనం చేశారు. ఆ సమయంలో ఇరువురు భావోద్వేగానికి గురయ్యారు.

We’re now on WhatsApp. Click to Join.

ఇక ట్విట్టర్ లో ఐదు నెలల తర్వాత కవిత ట్వీట్ చేసారు. సత్యమే గెలిచిందంటూ పేర్కొన్నారు. ఈ ట్వీట్‌కు తన నివాసానికి చేరుకున్న అనంతరం భర్త అనిల్‌, సోదరుడు కేటీఆర్‌తో కలిసి అభిమానులకు అభివాదం చేస్తున్న ఫొటోను పోస్ట్‌ చేశారు. ప్రస్తుతం ఈ ఫొటో వైరల్‌ అవుతోంది. కవిత చివరిసారిగా మార్చి 14న ఎక్స్‌ వేదికగా ట్వీట్‌ చేసింది. యాదాద్రి ఆలయంఫొటో పేపర్‌ క్లిప్‌ను షేర్‌ చేస్తూ.. ‘దేవుడు శాసించాడు … KCR నిర్మించాడు !!’ అని ట్వీట్‌ చేశారు. ఆ తర్వాత ఢిల్లీ లిక్కర్ కేసులో అరెస్ట్ అయ్యింది. అప్పటి నుంచి జైల్లోనే ఉన్నారు. ఇప్పుడు జైలు నుంచి బయటకు వచ్చిన కవిత.. 160 రోజుల సుదీర్ఘ విరామం తర్వాత తిరిగి ఎక్స్‌లో తొలి ట్వీట్‌ చేశారు.

Read Also : Telugu Bhasha Dinotsavam : తెలుగు భాషను గౌరవించుకుందాం – పవన్ కళ్యాణ్