Jr NTR: ఎన్టీఆర్ శత జయంతి ఉత్సవాలకు నేను రాలేను: జూనియర్

పుట్టిన రోజు కావడంతో శత జయంతి ఉత్సవాలకు హాజరుకాలేకపోతున్నట్టు జూనియర్ తెలిపారు.

  • Written By:
  • Updated On - May 20, 2023 / 03:04 PM IST

ఎన్టీఆర్ శత జయంతి దినోత్సవాల సభను ఇవాళ KPHB లో గ్రాండ్ గా నిర్వహించనున్నారు. ఈ భారీ సభకు చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్, దత్తాత్రేయ, బాలకృష్ణ, సీతారాం ఏచూరి, D రాజా, పురంధేశ్వరి, కాసాని జ్ఞానేశ్వర్.. పలువురు రాజకీయ ప్రముఖులు రానున్నారు. కానీ నేడు జూనియర్ ఎన్టీఆర్ పుట్టిన రోజు కావడంతో, ముందుగానే తన ఫ్యామిలీతో ఏర్పాటు చేసుకున్న కమిట్మెంట్స్ ఉండటంతో జూనియర్ ఎన్టీఆర్ ఈ సభకు హాజరుకాలేకపోతున్నట్టు తెలిపారు.

రాజకీయ ప్రముఖులు వస్తున్న తరుణంలో, ఎన్టీఆర్ మనవడు, జూనియర్ ఎన్టీఆర్ రాకపోవడంతో ఈ వార్త వైరల్ గా మారింది. దీనిపై టాలీవుడ్, తెలుగు రాజకీయాల్లో చర్చ కూడా మొదలైంది. నేడు జరగనున్న ఈ ఎన్టీఆర్ శతజయంతి ఉత్సవాల కార్యక్రమానికి పిలిచిన అందరు హీరోలలో కొంతమంది రాకపోతే ఎవరూ పట్టించుకోరు కానీ, అందరూ వచ్చి ఒక్క ఎన్టీఆర్ మాత్రం రాకపోతే అది కచ్చితంగా పెద్ద వార్త అవుతుందని భావిస్తున్నారు. ఎన్టీఆర్ అభిమానులు కూడా ఈ ఈవెంట్ కి వస్తే బాగుండు అని కోరుకుంటున్నారు. వెంకటేష్, ప్రభాస్, రామ్ చరణ్, నితిన్, రానా, శివరాజ్ కుమార్, అల్లు అర్జున్, కళ్యాణ్ రామ్, విజయ్ దేవరకొండ, శర్వానంద్, విశ్వక్సేన్, సిద్ధూ జొన్నలగడ్డ.. మరింతమంది హీరోలు, సినీ ప్రముఖులు కూడా హాజరు కానున్నారు.

విచిత్రమేమిటంటే, దివంగత ఎన్టీఆర్‌తో సన్నిహిత సంబంధాన్ని కలిగి ఉన్న మంచు మోహన్‌బాబుని ఉద్దేశపూర్వకంగా పక్కన పెట్టినట్టు తెలుస్తోంది. అతను ఆహ్వానిస్తే నిజం మాట్లాడతాడనే భయం నిర్వాహకుల్లో ఉంది. అభిమానుల్లో విపరీతమైన పాపులారిటీ ఉన్న మెగాస్టార్ చిరంజీవి కి కూడా ఇన్విటేషన్ అందకపోవడం అనేక పుకార్లకు దారితీస్తోంది.

Also Read: Rajinikanth: సినిమాలకు రజనీకాంత్ గుడ్ బై..? అయోమయంలో తలైవా ఫ్యాన్స్!