Bandi Sanjay : కేసీఆర్ కు సిగ్గుంటే… మునుగోడు పోటీ నుంచి తప్పుకోవాలి..!!

  • Written By:
  • Updated On - October 28, 2022 / 02:48 PM IST

సీఎం కేసీఆర్, టీఆర్ఎస్ పై మండిపడ్డారు తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్. కేసీఆర్ కు సిగ్గుంటే మునుగోడు పోటీ నుంచి తప్పుకోవాలన్నారు.టీఆర్ఎస్ ఎమ్మెల్యేలను బీజేపీ కొనుగోలు చేసేందుకు యత్నించిందని ఆ పార్టీ చేస్తున్న ఆరోపణలపై ఆయన ఫైర్ అయ్యారు. ఎమ్మెల్యేల కొనుగోలు కుట్ర జరిగిందని చెబుతున్న టీఆర్ఎస్ ఏసీబీ కోర్టుకు వెళ్లడం ఏంటని ప్రశ్నించారు. నిజంగానే డబ్బు దొరికితే అది ఎక్కడుంది. దీనికి స్టీఫెన్ రవీంద్ర సమాధానం చెప్పాలంటూ డిమాండ్ చేశారు.

తనను యాదాద్రికి వెళ్లకుండా అడ్డుకోవాలని పోలీసులకు ఆదేశాలు వచ్చాయని…ఎట్టిపరిస్థితుల్లో యాదాద్రికి వెళ్లి తీరుతా…అక్కడ ప్రమాణం చేసి తమ నిజాయితీని నిరూపించుకుంటామన్నారు. మునుగోడులో టీఆర్ఎస్ ఓడిపోతుందన్న భయంతోనే ఇలాంటి డ్రామాలు ఆడుతున్నారని ఫైర్ అయ్యారు. అన్ని సర్వేలు బీజేపీకి అనుకూలంగా రావడంతో…అధికారపార్టీ జీర్ణించుకోలేకపోతుందన్నారు. అందుకే దొంగదారి వెతుక్కున్నారని విమర్శించారు. ఇప్పటికైనా సీఎం కేసీఆర్ మునుగోడు బరి నుంచి తప్పకుంటే మంచిదన్నారు. మునుగోడులో కాషాయ జెండా ఎగరడం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు బండి సంజయ్.