Site icon HashtagU Telugu

Rajagopal : రాజగోపాల్ కు మంత్రి పదవి ఇస్తామని మాటిచ్చింది నిజమే – భట్టి

Rajagopal Minister Ppost

Rajagopal Minister Ppost

కాంగ్రెస్ పార్టీ నాయకుడు రాజగోపాల్‌ రెడ్డి(Rajagopal Reddy )కి మంత్రి పదవి ఇస్తామని ఇచ్చిన హామీ నిజమేనని తెలంగాణ ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క (Bhatti) స్పష్టం చేశారు. ఇటీవల రాజగోపాల్‌రెడ్డి మాట్లాడుతూ.. మంత్రి పదవి ఇస్తామని తమను మోసం చేశారని ఆరోపించారు. దీనిపై స్పందిస్తూ, భట్టి విక్రమార్క మాట్లాడుతూ, “రాజగోపాల్‌రెడ్డికి మంత్రి పదవి ఇస్తామని హామీ ఇవ్వడం వాస్తవమే. ఆ సమయంలో నేనూ ఉన్నాను” అని అన్నారు. దీంతో కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీని డిప్యూటీ సీఎం అధికారికంగా ధృవీకరించినట్లయింది.

HYD : చిన్న వర్షానికే హైదరాబాద్ అతలాకుతలం..దీనికి కారణం వారేనా..? ఇలా జరగకుండా ఉండాలంటే చేయాల్సింది ఏంటి..?

అయితే, రాజగోపాల్‌రెడ్డికి మంత్రి పదవి ఇవ్వలేకపోవడానికి గల కారణాన్ని కూడా భట్టి విక్రమార్క వివరించారు. “క్యాబినెట్ కూర్పులో భాగంగా పదవి ఇవ్వలేకపోయాం” అని ఆయన తెలిపారు. క్యాబినెట్ విస్తరణ, పార్టీలోని ఇతర సమీకరణల కారణంగా ఈ హామీని అమలు చేయలేకపోయారని ఆయన పేర్కొన్నారు. ఈ వివరణతో పార్టీలో చోటుచేసుకున్న అంతర్గత కారణాల వల్లనే ఈ నిర్ణయం తీసుకోవాల్సి వచ్చిందని భట్టి విక్రమార్క స్పష్టం చేశారు.

ఈ సందర్భంగా భట్టి విక్రమార్క మూసీ నది సుందరీకరణ ప్రాజెక్టు గురించి కూడా మాట్లాడారు. మూసీ సుందరీకరణలో భాగంగా ఇళ్లు కోల్పోయిన వారికి అక్కడే అపార్ట్‌మెంట్లు నిర్మించి ఇస్తామని ఆయన హామీ ఇచ్చారు. ఈ హామీ బాధితులకు కొంత ఉపశమనం కలిగించే అంశం. ఈ ప్రాజెక్టు వల్ల ప్రభావితమయ్యే ప్రజలకు ప్రభుత్వం అండగా ఉంటుందని, వారికి మెరుగైన పునరావాసం కల్పిస్తుందని ఆయన తెలిపారు.