Site icon HashtagU Telugu

Hyderabad Kidney Racket : హైదరాబాద్‌లో కిడ్నీ రాకెట్.. 20 మందికి కిడ్నీల మార్పిడి.. 12 కోట్లు వసూలు

Hyderabad Kidney Racket Case Alakananda Hospital Rachakonda Cp

Hyderabad Kidney Racket : హైదరాబాద్‌లోని సరూర్ నగర్‌లో ఉన్న అలకనంద ఆస్పత్రి కేంద్రంగా నడిచిన కిడ్నీ రాకెట్‌తో ముడిపడిన కీలక విషయాలు వెలుగుచూశాయి. ఈ వ్యవహారానికి కింగ్ పిన్‌గా డాక్టర్ అవినాష్‌ వ్యవహరించాడని గుర్తించిన రాచకొండ పోలీసులు, అతడిని అరెస్టు చేశారు. ఈ కేసులో మొత్తం 15 మందిని నిందితులుగా గుర్తించగా, ఇప్పటివరకు తొమ్మిది మంది అరెస్టయ్యారు. ఈవివరాలను రాచకొండ  సీపీ సుధీర్ బాబు మీడియాకు వెల్లడించారు. మిగతా వారిని త్వరలోనే అదుపులోకి తీసుకుంటామన్నారు. కిడ్నా రాకెట్‌లోని ముఠా సభ్యులు అలకనంద ఆస్పత్రి కేంద్రంగా  ఇప్పటి వరకు 20 మందికి కిడ్నీలు మార్పిడి చేశారని సీపీ చెప్పారు.  ఇందుకోసం ఒక్కొక్కరి నుంచి రూ. 60 లక్షలు చొప్పును మొత్తం రూ.12 కోట్ల దాకా వసూలు చేశారని తెలిపారు. కాగా, ఈ కేసు విచారణను సీఐడీకి అప్పగించాలని  తెలంగాణ సర్కారు నిర్ణయించింది. తెలంగాణ, తమిళనాడు, కర్ణాటకకు చెందిన వ్యక్తులతో ఈ కిడ్నీ రాకెట్‌తో సంబంధం ఉన్నట్లు తేలింది.

Also Read :Meerpet Murder Case : వీడిన మాధవి మర్డర్ మిస్టరీ.. హీటర్‌తో పొటాషియం హైడ్రాక్సైడ్‌‌లో ఉడికించి మరీ..

సీపీ సుధీర్ బాబు తెలిపిన కీలక వివరాలు..

Also Read :DBT Schemes Tsunami : మహిళలకు ‘నగదు బదిలీ’తో రాష్ట్రాలకు ఆర్థిక గండం : ఎస్‌బీఐ నివేదిక