Site icon HashtagU Telugu

Cyber Crimes : సైబర్ కేటుగాళ్లతో బ్యాంకు ఉద్యోగులకు లింకులు.. బండారం బయటపెట్టిన పోలీసులు

Cyber Crimes Bank Employees Hyderabad Police

Cyber Crimes : గత రెండు, మూడేళ్ల వ్యవధిలో సైబర్ నేరాలు విపరీతంగా పెరిగిపోయాయి. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ సహా పలు రాష్ట్రాల్లో హైదరాబాద్  సిటీ సైబర్‌ క్రైమ్‌ పోలీసులు భారీ ఆపరేషన్లు నిర్వహించి 52 మంది సైబర్‌ కేటుగాళ్లను అరెస్టు చేశారు. వీరు తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా 74 సైబర్‌ నేరాలకు, హైదరాబాద్‌ కమిషనరేట్‌ పరిధిలో 33 సైబర్‌ నేరాలకు పాల్పడి కోట్లు కొల్లగొట్టారని గుర్తించారు. ఈ దర్యాప్తులో కీలక విషయాన్ని గుర్తించారు. పలువురు సైబర్‌ నేరగాళ్లకు సహకరించిన నలుగురు బ్యాంకు ఉద్యోగులను అరెస్టు చేశారు. ఈ నలుగురు బ్యాంకు ఉద్యోగులు నేపాల్‌, చైనాల్లోని సైబర్‌ నేరగాళ్ల(Cyber Crimes) అకౌంట్లకు రూ.23కోట్లు అక్రమంగా పంపించారు.  దేశవ్యాప్తంగా 20 కేసుల్లో ఈ బ్యాంకు ఉద్యోగుల పాత్ర ఉందని నిర్ధారణ అయింది. సదరు సైబర్ కేటుగాళ్లు అక్రమంగా డబ్బులను తరలించుకునేందుకు ఉపయోగపడేలా మ్యూల్ ఖాతాలను ఈ బ్యాంకు ఉద్యోగులు క్రియేట్ చేశారు. ఇందుకుగానూ ప్రతి లావాదేవీకి 5 నుంచి 10శాతం మేర కమీషన్‌‌ను సైబర్ కేటుగాళ్ల నుంచి తీసుకున్నారు. ఈ కేసుల్లో సైబర్‌ క్రిమినల్స్‌ వద్ద రూ.47.90 లక్షల నగదు, రూ.40లక్షల క్రిప్టో కరెన్సీని హైదరాబాద్‌ సిటీ పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. నేరస్థుల ఖాతాల్లోని రూ.2.87కోట్లు ఫ్రీజ్‌ చేశారు.

Also Read :Maha Kumbh Stampede : అర్ధరాత్రి యోగి సమీక్ష.. మహాకుంభ మేళాపై కీలక నిర్ణయాలు

తెలంగాణ, ఏపీలోని కేసుల వివరాలివీ.. 

Also Read :Weddings Season : జనవరి 31 నుంచి పెళ్లిళ్ల సీజన్.. వరుసగా శుభ ముహూర్తాలు