Site icon HashtagU Telugu

Hyderabad Metro : హైదరాబాద్ మెట్రో రైలుకు అంతర్జాతీయ పురస్కారం, ప్రత్యేక గుర్తింపు

Hyderabad Metro Rail receives international award, special recognition

Hyderabad Metro Rail receives international award, special recognition

Hyderabad Metro : హైదరాబాద్ నగరానికి అభివృద్ధికి ప్రతీకగా, ప్రజారవాణాలో నూతన మైలురాయిగా నిలిచిన మెట్రో రైలు తాజాగా ఒక అరుదైన అంతర్జాతీయ గౌరవాన్ని సొంతం చేసుకుంది. ప్రపంచవ్యాప్తంగా ప్రజారవాణా రంగంలో అత్యున్నతంగా భావించే ‘ది ఇంటర్నేషనల్ అసోసియేషన్ ఆఫ్ పబ్లిక్ ట్రాన్స్‌పోర్ట్’ (UITP) అవార్డుల కోసం నిర్వహించిన 2025 హైదరాబాద్ మెట్రో ప్రత్యేక గుర్తింపుతో పురస్కారం అందుకుంది. ఇది దేశానికి మాత్రమే కాదు, నగరానికి కూడా ఎంతో గర్వకారణంగా మారింది. ఈ ప్రతిష్టాత్మక కార్యక్రమం ఇటీవల జర్మనీలోని హాంబర్గ్ నగరంలో నిర్వహించబడింది. ప్రపంచ నలుమూలల నుంచి సుమారు 500 రవాణా సంస్థలు వివిధ కేటగిరీల్లో పాల్గొనగా, హైదరాబాద్ మెట్రో రైలు లిమిటెడ్ (ఎల్‌అండ్‌టీ ఎంఆర్‌హెచ్‌ఎల్‌) ప్రత్యేక ప్రాజెక్టుతో టాప్ 5 ఫైనలిస్టులలో చోటు దక్కించుకుంది.

Read Also: Tamil Nadu : శివకాశిలో పేలుడు.. ఐదుగురి మృతి

ఇది మెట్రో నిర్వహణలో ఉన్న నైపుణ్యానికి, వినూత్న ఆలోచనలకు ప్రతీకగా నిలిచింది. ఈ గౌరవాన్ని పొందడానికి ముఖ్య కారణం హైదరాబాద్ మెట్రో రూపొందించిన ‘రైలు ఆదాయాన్ని పెంచడానికి దారితీసే ఆప్టిమైజ్డ్ మెట్రో ఆపరేషన్ ప్లాన్‌లు’ అనే ప్రాజెక్ట్. ఈ ప్రణాళిక ద్వారా మెట్రో కార్యకలాపాలను మరింత సమర్థవంతంగా నిర్వహించడంతో పాటు ఆదాయాన్ని కూడా గణనీయంగా పెంచగలిగారు. రోడ్స్ అండ్ ట్రాన్స్‌పోర్ట్ అథారిటీ (RTA) సహకారంతో రూపొందించిన ఈ ప్రాజెక్ట్‌ను ‘ఆపరేషనల్ ఎక్సలెన్స్’ కేటగిరీలో సమర్పించగా, ఈ రంగంలో ఉత్తమ five లో ఒకటిగా నిలిచింది. ఈ సందర్భంగా ఎల్‌అండ్‌టీ ఎంఆర్‌హెచ్‌ఎల్‌ ఎండీ మరియు సీఈవో కేవీబీ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ..అత్యుత్తమ నిబంధనలు, ఆచరణాత్మక వ్యూహాలతో మేము నగర రవాణాలో నూతన ప్రామాణికాలను స్థాపించాము. ఈ అంతర్జాతీయ గుర్తింపు, హైదరాబాద్ మెట్రో సాధించిన నాణ్యతకు అద్దం పడుతుంది.

ఇది మా టీమ్‌ ప్రతిభకు గుర్తింపుతో పాటు, భవిష్యత్తులో మరింత ఉన్నత లక్ష్యాలను చేరుకోవడానికి ప్రేరణ ఇస్తుంది” అని పేర్కొన్నారు. నిపుణుల అభిప్రాయం ప్రకారం, మెట్రో అందిస్తున్న సేవలు సాంకేతికత, వినూత్నత, సమర్థవంతతల సమ్మేళనంగా ఉండటం వల్లే ఈ గుర్తింపు లభించింది. నగర ప్రజలకు వేగవంతమైన, పరిశుభ్రమైన, సమయపాలనతో కూడిన ప్రయాణాన్ని అందిస్తున్న హైదరాబాద్ మెట్రో ఈ గుర్తింపు ద్వారా మరో మెట్టుపై నిలిచింది. ఇది హైదరాబాద్ నగర ప్రజల సహకారానికి, అధికారులు చూపించిన నిబద్ధతకు, సమర్థవంతమైన నిర్వహణకు చక్కటి ఉదాహరణగా నిలుస్తోంది. ప్రజారవాణా రంగంలో భారత్‌కు లభించిన ఈ గౌరవం దేశానికి మరింత ఖ్యాతిని తెచ్చిపెట్టనుంది.

Read Also: No Fuel : ఢిల్లీలో నేటి నుంచి ఆ వాహనాలకు పెట్రోల్‌, డీజిల్‌ బంద్‌.. ఎందుకంటే?