Asaduddin Owaisi: మైనార్టీ ఓటుబ్యాంక్ పై ‘ఎంఐఎం’ గురి

ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ వివిధ రాష్ట్రాల్లో ముస్లిం ఓటర్లను ప్రలోభపెట్టేందుకు ప్రయత్నిస్తున్నారు.

Published By: HashtagU Telugu Desk

ఏఐఎంఐఎం అధ్యక్షుడు, హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ ఉత్తరప్రదేశ్, పశ్చిమ బెంగాల్, బీహార్, గుజరాత్ సహా వివిధ రాష్ట్రాల్లో ముస్లిం ఓటర్లను ప్రలోభపెట్టేందుకు ప్రయత్నిస్తున్నారు. అసెంబ్లీలు, లోక్‌సభల్లో చెప్పుకోదగ్గ సంఖ్యలో ప్రజాప్రతినిధులను గెలుచుకోలేక పోయినప్పటికీ ఓట్ల శాతం పెరిగింది. బీహార్‌లో ఐదు అసెంబ్లీ స్థానాలను గెలుచుకోగా, పశ్చిమ బెంగాల్, ఉత్తరప్రదేశ్‌లలో ఖాతా తెరవలేకపోయింది. గుజరాత్‌లో రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసేందుకు పార్టీ సన్నద్ధమవుతోంది.

AIMIM బిజెపి B-టీమ్ అనే వాదనలను ఎదుర్కోవడమే కాకుండా, కాంగ్రెస్, ఇతర సెక్యులర్ పార్టీలు కాషాయ పార్టీని ఓడించగల బలం లేదని ప్రచారం చేయడంలో ఓవైసీ ముందుంటున్నాడు. ఎన్నో ఏళ్లుగా సెక్యులర్ పార్టీలకు మద్దతిస్తున్న ముస్లిం ఓటర్లను తమవైపు తిప్పుకోవడమే దీని వెనుక ఉద్దేశం. వివిధ రాష్ట్రాల్లో జరిగిన అనేక ర్యాలీల్లో ఒవైసీ మాట్లాడుతూ.. “ఏఐఎంఐఎం ముస్లిం ఓట్లను చీల్చివేస్తుందని, అది బీజేపీ అభ్యర్థుల విజయానికి దారి తీస్తుందని సెక్యులర్ పార్టీలు ముస్లింలను భయపెట్టేందుకు ప్రయత్నిస్తాయని ఆరోపించారు. అహ్మదాబాద్, సూరత్ మునిసిపల్ ఎన్నికల నుంచి ఏఐఎంఐఎం అసెంబ్లీ ఎన్నికలకు సిద్ధమవుతోందని ఆయన పేర్కొన్నారు.

  Last Updated: 21 Jun 2022, 12:42 PM IST