Site icon HashtagU Telugu

Harish Target : అంతర్గత కలహాలతోనే హరీశ్ ను టార్గెట్ చేశారు – మహేశ్ కుమార్

Quit India Movement..The foundation of the Congress movement: TPCC President Mahesh Kumar Goud's comments

Quit India Movement..The foundation of the Congress movement: TPCC President Mahesh Kumar Goud's comments

బీఆర్ఎస్ నాయకురాలు, ఎమ్మెల్సీ కవిత (Kavitha) చేసిన వ్యాఖ్యలు కాళేశ్వరం ప్రాజెక్టులో అవినీతి జరిగిందనే అంశాన్ని మరింత స్పష్టం చేశాయని తెలంగాణ పీసీసీ అధ్యక్షుడు మహేశ్ కుమార్ గౌడ్
(Bomma Mahesh Kumar Goud) పేర్కొన్నారు. ఈ కుంభకోణంలో ప్రధాన పాత్రధారులు ఎవరనేది అనవసరం అని, అవినీతి జరిగిందనేది కచ్చితమని ఆయన అన్నారు. ముఖ్యంగా ‘మామా అల్లుళ్ల’ వాటా ఎంతో తేలాలని ఆయన డిమాండ్ చేశారు. ఇది బీఆర్ఎస్ పార్టీలో నెలకొన్న కుటుంబ అంతర్గత కలహాలను సూచిస్తోందని ఆయన వ్యాఖ్యానించారు.

Harbhajan Singh: లలిత్ మోదీపై హర్భజన్ సింగ్ ఆగ్రహం.. కార‌ణ‌మిదే?

బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ కుటుంబంలో ‘మూడు ముక్కలాట’ ఫైనల్‌కు చేరిందని మహేశ్ కుమార్ గౌడ్ విమర్శించారు. బీఆర్‌ఎస్‌లో నెలకొన్న ఈ అంతర్గత తగాదాలను కాంగ్రెస్ పార్టీపై రుద్దడం సరికాదని ఆయన అన్నారు. కవిత చేసిన ఆరోపణలు బీఆర్‌ఎస్ పార్టీలో అంతర్గత విభేదాలు ఎంత తీవ్రంగా ఉన్నాయో తెలియజేస్తున్నాయని ఆయన అభిప్రాయపడ్డారు. ఈ క్రమంలోనే, అంతర్గత కలహాల కారణంగానే హరీశ్ రావును టార్గెట్ చేశారని ఆయన స్పష్టం చేశారు.

కాంగ్రెస్ ప్రభుత్వం ఇప్పటికే కాళేశ్వరం ప్రాజెక్టుపై విచారణను ప్రారంభించింది. ఈ నేపథ్యంలో, కవిత వ్యాఖ్యలు విచారణకు మరింత బలం చేకూర్చాయి. బీఆర్ఎస్ పార్టీలోని అంతర్గత విభేదాలు కాళేశ్వరం ప్రాజెక్టులోని అవినీతి అంశాన్ని మరింత ముందుకు తీసుకెళ్లడానికి ఉపయోగపడతాయని కాంగ్రెస్ భావిస్తోంది. ఈ పరిణామాలు తెలంగాణ రాజకీయాల్లో హాట్ టాపిక్‌గా మారాయి.