Harish Rao: అయోధ్య రామాలయం బీజేపీ కట్టలేదు.. నేనే 2 లక్షల విరాళం ఇచ్చా

  • Written By:
  • Publish Date - May 10, 2024 / 01:28 PM IST

Harish Rao: సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ అంబేద్కర్ చౌరస్తాలో కరీంనగర్ బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థి బోయినపల్లి వినోద్ కుమార్ కార్నర్ మీటింగ్ లో మాజీ మంత్రి, ఎమ్మెల్యే హరీష్ రావు పాల్గొని మాట్లాడారు. హుస్నాబాద్ అంటే కేసిఆర్‌కు చాలా ఇష్టంమని,  సెంటిమెంట్ ఉన్న ప్రాంతం అని, వికాసం కావాలంటే వినోద్ అన్న గెలవాలి. విధ్వసం కావాలంటే కాంగ్రెస్, బీజేపీ గెలవాలి అని హరీశ్ రావు అన్నారు. బీజేపీ బడా కార్పొరేట్ సంస్థల గురించి మాత్రమే ఆలోచించిందని, 14 లక్షల కోట్ల కార్పొరేట్ రుణాలను మాఫీ చేసింది. పేదలకు ఒక్క రూపాయి కూడా మాఫీ చేయలేదని మండిపడ్డారు.

బీజేపీ కార్మిక, కర్షక వ్యతిరేక పార్టీ. నల్ల చట్టాలు తెచ్చి 700 మంది రైతుల ఉసురు పోసుకుందని, బీజేపి పంచిన బొమ్మలను ఇంట్లో చూసి ఓటు వేస్తే కడుపు నిండుతుందా? పిల్లలు జీవితాలు బాగవుతాయా? అని హరీశ్ రావు ఫైర్ అయ్యారు. అయోధ్య రామాలయం బీజేపీ కట్టిందా? కాదు ట్రస్ట్ కట్టింది. ఆలయ నిర్మాణానికి నేను కూడా 2 లక్షల విరాళం ఇచ్చానని గుర్తు చేశారు.  నిన్న హైదరాబాద్‌లో రాహుల్ గాంధీ సభ తుస్సుమంది. 30 వేల కుర్చీలు వేస్తే 3 వేల మంది రాలేదని హరీశ్ రావు సెటైర్లు వేశారు.

కాంగ్రెస్ వాళ్లు ఓటు అడిగితే నెలకు 2500 బాకీపడ్డారని, ఐదు నెలలకు 12,500 ఇచ్చినాకనే ఓటు వేస్తామని అక్క చెల్లెల్లు చెప్పాలని, ప్రియాంక గాంధీ గెలిచాక ఇస్తామని హామీ ఇచ్చిన మెడికల్ కాలేజ్ హుస్నాబాద్‌కు వచ్చిందా? రేవంత్ రెడ్డి కంటే రాహుల్ గాంధీ ఎక్కువ అబద్ధాలు మాట్లాడున్నాడు. ఆయన రాహుల్ గాంధీ కాదు రాంగ్ గాంధీ అని హరీశ్ రావు అన్నారు.