Ganja : రాచకొండలో గంజాయి స్మగ్లింగ్ రాకెట్ గుట్టుర‌ట్టు.. 8 మందిని అరెస్ట్ చేసిన పోలీసులు

ఒడిస్సా రాష్ట్రం నుంచి హైదరాబాద్‌కు అక్రమంగా గంజాయిని తరలిస్తున్న ఎనిమిది మంది వ్యక్తులను ఎల్‌బీ నగర్ పోలీసులు,

  • Written By:
  • Updated On - February 10, 2023 / 06:23 AM IST

ఒడిస్సా రాష్ట్రం నుంచి హైదరాబాద్‌కు అక్రమంగా గంజాయిని తరలిస్తున్న ఎనిమిది మంది వ్యక్తులను ఎల్‌బీ నగర్ పోలీసులు, స్పెషల్ ఆపరేషన్స్ టీమ్ (ఎస్‌ఓటీ) అరెస్టు చేశారు. ఎల్‌బీ నగర్ పోలీస్ స్టేష‌న్ పరిధిలోని నాగోల్‌లో కొంత‌మందికి గంజాయి విక్రయిస్తుండా ఈ ముఠాని పోలీసులు ప‌ట్టుకున్నారు. వారి వద్ద నుంచి (10) కేజీల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. సూర్యాపేట మండలానికి చెందిన షేక్‌ అబ్బాస్‌ పెడ్లర్‌ కమ్‌ వినియోగదారుడు, మర్యాద దినేష్‌ రెడ్డి, శ్రీనివాస్‌ రెడ్డి, చెరుకు చందు, సత్తు శ్రీరామ్‌ చరణ్‌ తేజ, ఆవుల సందీప్‌, అజరు పాషా, సాహిల్‌ సింగ్‌తో కలిసి డ్రగ్స్‌ వ్యాపారం చేస్తూ డ్రగ్స్‌ సేవిస్తున్నారని పోలీసులు తెలిపారు. ఈ ముఠా పొరుగున ఉన్న ఒడిశా నుంచి అక్రమంగా గంజాయిని రవాణా చేసి హైదరాబాద్‌ పరిసర ప్రాంతాల్లోని వినియోగదారులకు విక్రయిస్తున్నట్లు పోలీసు కమిషనర్‌ రాచకొండ డీఎస్‌ చౌహాన్‌ మీడియాకు తెలిపారు. పక్కా సమాచారంతో ఎస్‌ఓటీ, ఎల్‌బీ నగర్ పోలీసులు కలిసి పీఎస్ ఎల్‌బీ నగర్ పరిధిలోని నాగోల్ వద్ద ముఠాను అదుపులోకి తీసుకుని వారి వద్ద నుంచి పది కేజీల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు.