Site icon HashtagU Telugu

Four Died: కొత్తగూడెం జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం.. నలుగురు దుర్మరణం

Mexico Bus Crash

Road accident

కొత్తగూడెం జిల్లాలో శుక్రవారం అర్థరాత్రి ఘోర రోడ్డు ప్రమాదం (Road Accident) జరిగింది. ఈ ఘటనలో కారు-లారీ ఢీకొట్టింది. నలుగురు మృతి చెందారు. ఇల్లందు- మహబూబాబాద్ మధ్య కోటి లింగాల సమీపంలో ఈ ఘటన చోటు చేసుకుంది. ఈ రోడ్డు ప్రమాదంలో నలుగురు మృతి చెందారు. కారు నడుపుతున్న వ్యక్తితో పాటు ముగ్గురు అక్కడికక్కడే మృతి చెందారు. ప్రమాదంలో గాయపడిన మరో వ్యక్తిని ఇల్లందు ఆసుపత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ మృతి చెందాడు.

Also Read: 9 Injured : నోయిడా ఎయిర్‌పోర్ట్ వ‌ద్ద పేలిన సిలిండ‌ర్‌.. 9 మందికి గాయాలు

మరొకరి పరిస్థితి విషమంగా ఉండడంతో ఖమ్మంలోని ఆస్పత్రికి తరలించారు. వీరు ప్రయాణిస్తున్న కారును వేగంగా వచ్చిన లారీ ఢీకొనడంతో ఈ ప్రమాదం జరిగింది. మృతులు హనుమకొండ జిల్లాకు కమలాపూర్ కు చెందిన అరవింద్, వరంగల్ కు చెందిన రాము, కల్యాణ్, శివగా గుర్తించారు. ప్రీ వెడ్డింగ్ షూట్ కోసం వీరంతా మోతేకి వెళ్తున్నట్లు సమాచారం. మరింత సమాచారం తెలియాల్సి ఉంది.

Exit mobile version