దశాబ్దం నిర్లక్ష్యం తర్వాత తెలంగాణలో రైతు సంక్షేమ రాజ్యం వచ్చింది. తెలంగాణ లో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి ఏడాది పూర్తిచేసుకోబోతున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ప్రభుత్వం ప్రజాపాలన విజయోత్సవాలు (Farmers’ Festival) చేపడుతోంది. మొత్తం ఐదు రోజుల పాటు ప్రజాపాలన విజయోత్సవాలను నిర్వహించనున్నారు. ఇందులో భాగంగా మహబూబ్ నగర్ (Mahabubnagar) లో నేటి నుండి రైతు పండగ నిర్వహిస్తున్నారు. ఓ సభలా కాకుండా ఉత్సవంలా నిర్వహిచాలని సీఎం రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) ఇప్పటికే అధికారులను ఆదేశించడం తో అధికారులు దానికి తగ్గట్లే ఏర్పాట్లు చేసారు.
కాంగ్రెస్ పార్టీ ఎన్నికల్లో పలు హామీలు ఇచ్చిన సంగతి తెలిసిందే. వాటిలో ఉచిత కరెంట్ , మహిళలకు ఫ్రీ బస్సు , రైతుల రుణమాఫీ వంటి కీలక హామీలు ఇప్పటికే అమలు చేయడం తో ప్రజలు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. రాష్ట్రంలో 22,22,000 మంది రైతులకు రెండు లక్షల రుణమాఫీ జరిగింది. అలాగే “ఫైన్ రైస్” కోసం రూ. 500 బోనస్ గులాబీ పాలనలో ఎన్నడూ లేని విధంగా రైట్లను సుసంపన్నం చేస్తుంది. తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం తన ప్రథమ వార్షికోత్సవాన్ని రైతుల సంక్షేమంలో మైలురాయిగా చాటుకుంటూ రూ. 54,280 కోట్లను వివిధ పథకాల కోసం ఖర్చు చేయడాన్ని హైలైట్ గా చెప్పొచ్చు. రైతుల కోసం కాంగ్రెస్ చేసిన ఖర్చు చూస్తే..
పంట రుణాల మాఫీ: రూ. 17,869 కోట్లు
రైతు బంధు పథకం: రూ.7,625 కోట్లు
రైతు బీమా (బీమా ప్రీమియం): రూ. 1,455 కోట్లు
పంట బీమా ప్రీమియం చెల్లింపు: రూ. 1,300 కోట్లు
వ్యవసాయానికి ఉచిత విద్యుత్: రూ.10,444 కోట్లు
రబీ 2023-24లో ధాన్యం కొనుగోలు: రూ.10,547 కోట్లు
ఖరీఫ్ 2024లో ఇప్పటి వరకు ధాన్యం కొనుగోలు: రూ. 5,040 కోట్లు ఖర్చు చేసింది.
రాష్ట్ర ప్రభుత్వం రైతుల సంక్షేమానికి ముందున్న పథకాలన్నింటిని కొనసాగించడమే కాకుండా కొత్తగా రైతు నేస్తం పథకాన్ని ప్రారంభించింది. ఇది రైతులకు వివిధ పంటలపై సలహాలు, సిఫార్సులు అందించేందుకు ఉపయోగపడుతుంది. సూపర్ ఫైన్ ధాన్యం క్వింటాల్కు రూ. 500 బోనస్ ఇవ్వడం వల్ల బంపర్ క్రాప్ సాధ్యమైంది. అలాగే నూనెగింజల సాగును ప్రోత్సహించేందుకు ప్రభుత్వం ప్రత్యేక చర్యలు చేపట్టింది. ఇక రైతు పండగ ఉత్సవాల్లో రైతులకు వ్యవసాయం గురించి కొత్త విషయాలు చెప్పడం, ఆధునిక పద్దుతుల్లో వ్యవసాయం చేయడం, లాభసాటి వ్యవసాయం లాంటి అంశాలపై అవగాహన కల్పించనున్నారు. ఈ ఉత్సవాల సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి ఈనెల 30 మహబూబ్ నగర్ కు రానున్నారు.
Great news! #Telangana
After a neglect of a decade, #Farmer welfare tops focus of government. Revanth Reddy govt gives highest support for farmers
– Loan waiver for over 22,22,000 farmers
– Rs 500 bonus for “fine rice” enriches ryots unlike ever during pink regime… pic.twitter.com/zfHX6QozDr
— Sriram Karri (@oratorgreat) November 28, 2024
Read Also : Ram Gopal Varma : రామ్ గోపాల్ వర్మ పిటిషన్ పై విచారణ వాయిదా