Site icon HashtagU Telugu

Ex-Minister Geetha Reddy: ఈడీ ముందుకు గీతారెడ్డి, టీ కాంగ్రెస్ లో టెన్షన్!

Geetha Reddy

Geetha Reddy

కాంగ్రెస్ నేతలపై ఈడు దూకుడుగా వ్యవహరిస్తోంది. నేషనల్ హెరాల్డ్ కేసులో మాజీ మంత్రి, కాంగ్రెస్ సీనియర్ నేత జె.గీతారెడ్డి గురువారం ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) ఎదుట హాజరయ్యారు. మాజీ మంత్రులు గీతారెడ్డి, మహమ్మద్ అలీ షబ్బీర్, పి.సుదర్శన్ రెడ్డిలకు ఈడీ నోటీసులు అందజేసింది. యంగ్ ఇండియన్ ప్రైవేట్ లిమిటెడ్‌కు చేసిన చెల్లింపులకు సంబంధించి వివరణ కోరుతూ మాజీ ఎంపీ అంజన్ కుమార్ యాదవ్, కాంగ్రెస్ నాయకుడు గాలి అనిల్ కుమార్ లను ప్రశ్నించనుంది.

సోమవారం (అక్టోబర్ 3), షబ్బీర్ అలీ ED ముందు హాజరయ్యారు. యంగ్ ఇండియన్‌కు నిధుల గురించి అధికారులు ఆరు గంటల పాటు ప్రశ్నించారు. మనీలాండరింగ్ ఆరోపణలపై ఇప్పటికే కాంగ్రెస్ తాత్కాలిక అధ్యక్షురాలు సోనియా గాంధీ, కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీలను ఈడీ ప్రశ్నించింది. కేంద్ర దర్యాప్తు సంస్థలను దుర్వినియోగం చేస్తున్నారంటూ కాంగ్రెస్‌ కార్యకర్తలు వివిధ రాష్ట్రాల్లో నిరసనలు చేపట్టారు.

అయితే తెలంగాణ కాంగ్రెస్ నేతలు ఈడీ రాడార్ కిందకు రావడం తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించింది. బీజేపీ నేతృత్వంలోని ఎన్డీయే ప్రభుత్వం రాజకీయ ప్రతీకారానికి ఈడీని వాడుకుంటోందని కాంగ్రెస్ ఆరోపించింది. దీనికి బదులుగా కాంగ్రెస్‌ నేతలు తమ నిర్దోషిత్వాన్ని నిరూపించుకోవాలని బీజేపీ డిమాండ్‌ చేస్తోంది.